సిగ్గుతో తలవంచుకున్న దేశ రాజధాని.. ఆరేళ్ల చిన్నారిపై ముగ్గురు బాలుర ఘాతుకం!
దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వం సిగ్గుతో తలవంచుకునే దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం 6 ఏళ్ల వయస్సు ఉన్న పసిపాపపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు మైనర్లు గతేడాది మరణించిన ఆ చిన్నారి అన్నయ్యకు స్నేహితులు కావడం గమనార్హం.
ఢిల్లీలో వెలుగుచూసిన దారుణం
ఈశాన్య ఢిల్లీలోని భజన్పురా ప్రాంతంలో జనవరి 18న సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. నిందితుల వయస్సు కేవలం 10, 13, 14 ఏళ్లు మాత్రమే. ఆహారం ఇస్తామని ఆశ చూపి ఆ బాలికను సమీపంలోని ఓ నిర్మానుష్యమైన రెండంతస్తుల భవనంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారి చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తీవ్ర రక్తస్రావంతో ఇంటికి చేరుకున్నప్పుడు, నిందితుల్లో ఒకడైన 13 ఏళ్ల పక్కింటి అబ్బాయి.. ఆమె కింద పడిపోయిందని అబద్ధం చెప్పాడు. అయితే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తల్లికి అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా, అసలు విషయం బయటపడింది. వెంటనే బాధితురాలిని జాఫరాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు.

వైద్య నివేదికలో విస్తుపోయే నిజాలు
జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందించారు. వైద్యులు అందించిన నివేదిక అత్యంత బాధాకరంగా ఉంది. బాలిక కనీసం నిలబడలేని, నడవలేని స్థితిలో ఉంది. తీవ్రమైన అంతర్గత రక్తస్రావం కారణంగా చిన్నారి నరకయాతన అనుభవిస్తోంది. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా హెచ్ఐవీ (HIV), ఇతర సుఖ వ్యాధుల పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించారు.
నరకయాతన అనుభవిస్తోన్న చిన్నారి
విచారణ సమయంలో బాలిక వివరాలన్నింటిని వెల్లడించిందని.. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించినట్లు విచారణలో తేలిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. నిందితులను జనవరి 19న అదుపులోకి తీసుకుని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇంట్లోనే కోలుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. బాలిక ప్రస్తుతం మంచానికే పరిమితమైనట్లు.. నడిచినా లేదా కదిలినా రక్తస్రావంతో, నొప్పితో విలవిలలాడుతోందని తల్లి వాపోతోంది. మరోవైపు నిందితులను వయోజనులుగా పరిగణించి కఠినంగా శిక్షించాలని చిన్నారి తండ్రి డిమాండ్ చేశాడు.
సవాలుగా మారిన కేసు
ఈ కేసులో నిందితులందరూ 18 ఏళ్ల లోపు వారు కావడంతో, వారిని వయోజనుల మాదిరిగా విచారించడం చట్టపరంగా సవాలుగా మారింది. నిర్భయ ఘటన తర్వాత వచ్చిన సవరణల ప్రకారం, 16-18 ఏళ్ల లోపు వారు ఘోర నేరాలు చేస్తేనే వారిని వయోజనులుగా పరిగణించే అవకాశం ఉంటుంది. నిందితుల వయస్సు తక్కువగా ఉన్నప్పటికీ, వారు చేసిన నేరం అత్యంత క్రూరమైనదని, వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తండ్రి డిమాండ్ చేస్తున్నారు. నిందితులు ఒక వర్గానికి చెందిన వారు కావడం, బాధితురాలు మరో వర్గానికి చెందిన వారు కావడంతో ఈ ఘటన మతపరమైన రంగు పులుముకుంది. హిందూ మితవాద సంఘాలు రోడ్లను దిగ్బంధించి నిరసనలు తెలుపుతున్నాయి. మూడో నిందితుడు తన కుటుంబంతో సహా పరారీలో ఉండటంతో, వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సాధారణంగా ఇంత చిన్న వయసులో ఇలాంటి నేరాలకు పాల్పడటం వెనుక ఇంటర్నెట్లో అశ్లీల కంటెంట్ చూడటం లేదా పర్యవేక్షణ లేకపోవడం వంటి కారణాలు ఉండవచ్చని మనస్తత్వ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఈ దిశగా కూడా విచారణ జరుపుతున్నారు.
-
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్












Click it and Unblock the Notifications