దారులన్నీ అటువైపే..! కుంభమేళాకు పోటెత్తిన జనం
అలహాబాద్ : కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశవిదేశాల నుంచి ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) కు క్యూ కడుతున్నారు. పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం ఒక్కరోజే దాదాపు 70 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. కుంభమేళాలో పవిత్రస్నానాలు చేయడానికి దీన్ని ముఖ్యమైన రోజుగా భావిస్తారు చాలామంది. దీంతో చలిని సైతం లెక్కచేయకుండా... ఆదివారం రాత్రి నుంచే గంగానది దగ్గర భక్తుల కోలాహలం కనిపించింది.
సూర్యోదయానికి ముందే చాలామంది పుణ్యస్నానాలు ముగించుకున్నారు. వేకువజామున చంద్రుడు పూర్ణాకృతిలో దర్శనమివ్వడంతో భక్తులకు కనువిందు చేసినట్లైంది. మైక్ సెట్లలో వినిపించిన డివొషనల్ సాంగ్స్ సందర్శకులను మరింత ఉత్తేజపరిచాయి. కుంభమేళాలో పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. కల్పవాస్ ప్రారంభానికి ప్రతీకగా దీన్ని పరిగణించడంతో భక్తులు పవిత్ర దినంగా భావిస్తారు.

ఈ ఏడాది దాదాపు 15 కోట్ల మంది వరకు కుంభమేళాకు వస్తారనే అంచనాతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. తాత్కాలిక టెంట్ సిటీ (గుడారాలు) వేసి సౌకర్యాలు కల్పించింది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications