వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధనుష్, ఐశ్వర్య: విడిపోతున్నట్లు ప్రకటించిన దంపతులు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

తమిళ హీరో ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు.

"గత 18 సంవత్సరాలుగా మేము స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు విడిపోతున్నామంటూ" ధనుష్ ఒక లేఖను ట్వీట్ చేశారు.

https://twitter.com/dhanushkraja/status/1483128992312225792/photo/1

"ఇకపై మేమిద్దరం వేరు వేరు దారుల్లో నడవాలని నిర్ణయించుకున్నాం. వ్యక్తిగతంగా సమయాన్ని వెచ్చించాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించి, మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం" అంటూ ఆ లేఖలో రాశారు.

ఐశ్వర్య, ధనుష్ ఇద్దరూ తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కుటుంబాలకు చెందినవారే.

ఐశ్వర్య, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె కాగా.. ధనుష్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన కస్తూరి రాజా కుమారుడు.

Dhanush

ఇటీవల టాలీవుడ్‌లో సమంత, అక్కినేని నాగ చైతన్య దంపతులు కూడా విడిపోయారు.

తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామని సమంత, అక్కినేని నాగ చైతన్య ప్రకటించారు.

''చాలా చర్చలు, ఆలోచనల తర్వాత సమంత, నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరి మధ్య దశాబ్ద కాల స్నేహబంధం ఉంది. ఇకపై కూడా ఆ స్నేహ బంధం కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం''అని నాగ చైతన్య ట్వీట్‌చేశారు.

https://twitter.com/chay_akkineni/status/1444241025430536194

2010లో విడుదలైన 'ఏమాయ చేశావే’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించినప్పటి నుంచి వీరి మధ్య పరిచయం పెరిగింది.

2017 అక్టోబర్ 6వ తేదీన గోవాలో వీరు హిందు, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Dhanush, Aishwarya: Couple announcing separation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X