చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Doubt: పెళ్లి జరిగిన ఏడాది హ్యాపీ, పంచాయితీలు, భర్తకు డౌట్, భార్యను కట్టేసి కత్తితో పొడిచి ?, నేరుగా వెళ్లి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కడలూరు: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంవత్సరం రోజులు సంతోషంగా కాపురం చేశారు. భార్య ఉద్యోగం చేస్తోంది. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు రాజీ పంచాయితీలు చేసి దంపతులకు నచ్చ చెబుతూ వస్తున్నారు. పెద్దలు పంచాయితీలు చేసిన వారం రోజులు దంపతులు సైలెంట్ గా ఉంటున్నారు. తరువాత దంపతుల మద్య మళ్లీ గొడవలు జరిగేవి. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన భర్త అతని భార్య చేతులు, కాళ్లు కట్టేశాడు. కత్తి తీసుకుని భార్యను పొడిచి చంపేసిన భర్త ఆమె చనిపోయిందా ? లేదా ? అని నిర్దారించుకున్నాడు. భార్య ప్రాణం పోయిందని నిర్దారించుకున్న భర్త నేరుగా వెళ్లి పోలీస్ స్టేష్ లో లొంగిపోయాడు. భర్త చెబుతున్న స్టోరీకి, పోలీసులు చెబుతున్న స్టోరీకి చాలా వ్యాత్యాసం ఉంది.

Wife: భర్త, అత్తకు కుష్కాలో నిద్రమాత్రలు కలిపి పెట్టిన కిలాడీ కోడలు, నగలతో ప్రియుడితో జంప్ !Wife: భర్త, అత్తకు కుష్కాలో నిద్రమాత్రలు కలిపి పెట్టిన కిలాడీ కోడలు, నగలతో ప్రియుడితో జంప్ !

ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి

ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని విరుదాచలం సమీపంలోని కమ్మాపురంలో నాగరాజ్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం పెద్దలు సెట్ చేసిన రాజలక్ష్మి (25) అనే యువతిని నాగరాజ్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాజలక్ష్మి, నాగరాజ్ దంపతులు సంవత్సరం రోజులు సంతోషంగా కాపురం చేశారు.

చిన్న ఉద్యోగం చేస్తున్న భార్య

చిన్న ఉద్యోగం చేస్తున్న భార్య

కమ్మాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో రాజలక్ష్మి వంట పని చేసోంది. నాగరాజ్ మేస్త్రీ పని చేస్తున్నాడు. పెళ్లి జరిగి 6 సంవత్సరాలు అవుతున్నా నాగరాజ్, రాజలక్ష్మి దంపతులకు పిల్లలు పుట్టలేదు. కొంతకాలం నుంచి నాగరాజ్, రాజలక్ష్మి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రానురాను రాజలక్ష్మి, నాగరాజ్ దంపతుల మద్య గొడవలు పెద్దవి అయ్యాయి.

భార్య మీద మొదటి నుంచి డౌట్

భార్య మీద మొదటి నుంచి డౌట్

పెద్దలు రాజీ పంచాయితీలు చేసి రాజలక్ష్మి, నాగరాజ్ దంపతులకు నచ్చ చెబుతూ వస్తున్నారు. పెద్దలు పంచాయితీలు చేసిన వారం రోజులు రాజలక్ష్మి, నాగరాజ్, రాజజలక్ష్మి, నాగరాజ్ దంపతులు సైలెంట్ గా ఉంటున్నారు. తరువాత రాజలక్ష్మి, నాగరాజ్ దంపతుల మద్య మళ్లీ గొడవలు జరిగేవి. వివాహం చేసుకున్న సంవత్సరం తరువాత నుంచి భార్య రాజలక్ష్మి మీద ఆమె భర్త నాగరాజ్ కు అనుమానం ఉండేది.

 రాత్రి ఇంటికి వెళ్లి భార్యను కట్టేసి ?

రాత్రి ఇంటికి వెళ్లి భార్యను కట్టేసి ?

రాత్రి ఇంటికి వెళ్లిన నాగరాజ్ భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు ఎవరితోనో తిరుగుతున్నావని నాగరాజ్, లేదు నువ్వే వేరే మహిళతో తిరుగుతున్నావని రాజలక్ష్మి గొడవడేశారు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన నాగరాజ్ అతని భార్య రాజలక్ష్మి చేతులు, కాళ్లు కట్టేశాడు. కత్తి తీసుకుని భార్య రాజలక్ష్మి ముఖం మీద పొడిచి చంపేసిన భర్త ఆమె చనిపోయిందా ? లేదా ? అని నిర్దారించుకున్నాడు.

 భార్య మీద భర్తకు ఫుల్ డౌట్

భార్య మీద భర్తకు ఫుల్ డౌట్

రాజక్ష్మి ప్రాణం పోయిందని నిర్దారించుకున్న ఆమె భర్త నాగరాజ్ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య రాజలక్ష్మి తన మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించడంతో చంపేశాని నాగరాజ్ పోలీసులకు చెప్పాడు. అయితే భార్య రాజలక్ష్మి మద ఆమె భర్త నాగరాజ్ కు అనుమానం ఉందని పోలీసులు అన్నారు.

పదేపదే వెళ్లిపోతున్న భార్య

పదేపదే వెళ్లిపోతున్న భార్య

భార్య రాజలక్ష్మి మీద అనుమానంతోనే ఆమెను నాగరాజ్ చంపేశాడని పోలీసులు అంటున్నారు. తనతో గొడవపడిన ప్రతిసారి నా భార్య రాజ్యలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయిందని, ఆమెకు ప్రతిసారి నచ్చచెప్పి ఇంటికి పిలుచుకుని వచ్చానని, పుట్టింటి దగ్గర ఆమె ఏదో చేస్తోందని తనకు అనుమానం ఉందని నాగరాజ్ పోలీసులకు చెప్పాడు. నాగరాజ్ చెబుతున్న స్టోరీకి, పోలీసులు చెబుతున్న స్టోరీకి చాలా వ్యాత్యాసం ఉందని రాజలక్ష్మి బంధువులు అంటున్నారు.

English summary
Doute: Husband kills wife in Virudhachalam, husband surrender in the police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X