రాజస్తాన్లో మరోసారి భూకంపం.. 4.8 తీవ్రతతో ప్రకంపనాలు
రాజస్తాన్లో మరోసారి భూమి కంపించింది. రెండురోజుల్లోనే మరోసారి భూకంపం వచ్చింది. బికనీర్లో తెల్లవారుజామున భూ ప్రకంపనాలు వచ్చాయి. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.8గా నమోదు అయ్యింది. ఉదయం 7.42 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలియజేసింది. భూకంపంతో ఆస్త్రి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు.
బికనీర్లో భూమి కంపించగా.. ఇటు పాకిస్తాన్లో కూడా భూకంపం వచ్చింది. అక్కడ కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని.. కానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. భూకంప కేంద్రం పాకిస్తాన్లో ఉంది అని తెలిపారు. అక్కడ భూమి 5.3 తీవ్రతతో కంపించింది. దాని ప్రభావం 110 కిలోమీటర్ల మేర చూపించింది. భూకంప కేంద్రం బికనీర్కు 343 కిలోమీటర్లు, జోద్ పూర్కు 439 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు చోట్ల వచ్చిన భూకంపాలతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు.