వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాంసాహారం, స్మార్ట్ ఫోన్ల వల్లే రేప్: బీహార్ మంత్రి
మాంసాహార స్వీకరణే అత్యాచారాలకు మూలకారణమని మంత్రిగారు చెప్పారు. మాంసాహారం తిన్న వ్యక్తికి అత్యాచారం చేయాలనిపిస్తుందని వినయ్ బీహారీ అభిప్రాయపడ్డారు. చికెన్, చేపలు తినే వ్యక్తుల్లో రేప్ ఆలోచనలు అధికంగా పురివిప్పుతాయని ఆయన అన్నారు.
మొబైల్ ఫోన్లు కూడా యువతను అత్యాచారాల బాటపట్టిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. యువత మొబైల్ ఫోన్లను బ్లూఫిల్ములు చూసేందుకు ఎక్కువగా వినియోగిస్తోందని అన్నారు. అశ్లీల చిత్రాలు చూడడం ద్వారా రేప్ కాంక్ష పెరిగిపోతుందన్న విషయాన్ని యువతకు విడమర్చాలని వినయ్ బీహారీ సూచించారు.
ఇంతకీ ఈ మంత్రివర్యులు భోజ్పురి సినిమా డైరక్టర్ మాత్రమే కాకుండా, ఫక్తు శాకాహరి కావడం గమనార్హం. యువత తమ మొబైల్ ఫోన్లలోని ఇంటర్నెట్ను విద్యను నేర్చుకోవడానికి ఉపయోగించడం లేదని, పోర్నోగ్రఫీ చూడడానికే ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు.
Comments
English summary
In one of the most shocking statements on the increasing crime against women, Bihar minister for art, culture and youth affairs Vinay Bihari said, "People who eat more non-vegetarian food like chicken and fish are inclined towards carrying out molestation and rape".
Story first published: Tuesday, July 15, 2014, 15:48 [IST]