సోనియా, రాహుల్ కు ఈడీ సమన్లు-నేషనల్ హెరాల్డ్ కేసులో జూన్ 8న రావాలంటూ..
2011-12 నాటి నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందజేసిందని, వారిని ఏజెన్సీ ముందు హాజరుకావాలని కోరినట్లు ఆ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా తెలిపారు.
జూన్ 8న ఈడీ ఎదుట హాజరుకావాలని ఈడీ కోరింది. అలాగే జూన్ 2వ తేదీ హాజరుకావాలని రాహుల్ గాంధీని కోరగా.. తాను దేశం వెలుపల ఉన్నందున మరికొంత సమయం కావాలని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ ను కూడా సోనియాతో కలిపి జూన్ 8న హాజరుకావాలని ఈడీ కోరింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ లీగల్ సెల్ నేత అభిషేక్ మనుసింఘ్వీ వెల్లడించారు. మరోవైపు ఈడీ సమన్లపై కాంగ్రెస్ మండిపడింది.

ప్రతిసారీ నేషనల్ హెరాల్డ్ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని బీజేపీ పూర్వీకుల్ని వెనకేసుకువస్తోందని, స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిందని, అగౌరవపరిచిందని సూర్జేవాలా ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1942లో ప్రారంభించారని, అప్పట్లో బ్రిటిష్ వారు దానిని అణిచివేసేందుకు ప్రయత్నించారని, నేడు మోదీ ప్రభుత్వం ఈడీని కూడా అదే పనిగా ఉపయోగించుకుంటోందని రణదీప్ సూర్జేవాలా అన్నారు. అసలు మనీలాండరింగ్ లేనప్పుడు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ఈ చర్య పగ, చిన్నతనం, భయం, రాజకీయ చౌకబారుతనంతో కూడుకున్నదన్నారు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications