ఆంధ్రా పాలు కంపెనీలో సీనియర్ అధికారి, సుపారి ఇచ్చి నడిరోడ్డులో ఏం చేశారంటే ? రివర్స్ !
పని చేస్తున్న ప్రైవేట్ కంపెనీలో పై అధికారి టార్చర్ ఎక్కువ కావడంతో కొందరు ఉద్యోగులు సతమతం అయ్యారు. పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఆ ఉద్యోగులు సహనం కోల్పోయారు. తమ మీద పని ఒత్తిడి తీసుకు వస్తున్న అధికారికి బుద్ది చెప్పాలని కొందరికి సుపారి ఇచ్చి రంగంలోకి దింపారు. నడిరోడ్డు మీద పై అధికారిని అడ్డగించి ఇనుప రాడ్లతో చితకబాదేశారు. అయితే తరువాత అసలు కథ మొత్తం రివర్స్ అయ్యింది.
గత కొన్ని రోజులుగా బెంగళూరులోని నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బెంగళూరులోని రోడ్డులో మధ్యాహ్నం ఓ వ్యక్తి పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడే అతని మీద దాడి చేసింది ఎవరు? అని నెటిజన్లు ఆరా తీశారు. ఇదే సమయంలో వైరల్ వీడియో బెంగళూరు పోలీసుల కంట్లో పడటంతో పోలీసులు విచారణ చేశారు.

బెంగళూరు పోలీసుల విచారణలో ఆవ్యక్తి మీద దాడికి గల కారణాలు వెల్లడికావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కంపెనీలో పని భారం ఎక్కువైందని, పై అధికారి టార్చర్ ఇచ్చారని అర్థం.
అయ్యింది. బైక్పై తన స్నేహితుడితో ప్రయాణిస్తున్న వ్యక్తిని అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు ఇనుప రాడ్తో దారుణంగా దాడి చేశారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న కారు డ్యాష్బోర్డ్లో దాడి చేసిన వారి భాగోతం మొత్తం రికార్డు అయ్యింది.
ఇప్పుడు ఆ వీడియో ఆధారంగా బెంగళూరు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
దాడికి గురైన వ్యక్తి పేరు సురేష్, గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ప్రముఖ పాలు సరఫరా చేసే కంపెనీలో సురేష్ ఆడిటర్గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాల కంపెనీకి బెంగళూరులో కార్యాలయాలు ఉన్నాయి. ఇదే కార్యాలయంలో సురేష్ ఆడిటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సురేష్ వచ్చిన తర్వాత పని ఒత్తిడి పెరిగిందని సమాచారం.
దానికితోడు రోజూవారీ సొమ్ము ఏ రోజుకు ఆ రోజు క్లియరెన్స్ చేయాలని కూడా సురేష్ ఆ కంపెనీ ఉద్యోగులను ఆదేశించాడని వెలుగు చూసింది. ఈ విషయం అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఉమాశంకర్, వినీష్కు కోపం తెప్పించింది.
ఇదే కారణంతో గతంలో అదే కంపెనీలో పనిచేసి ప్రస్తుతం ఆ కంపెనీలో ఉద్యోగం మానేసిన ఓ వ్యక్తి ద్వారా సందీప్ అనే వ్యక్తిని సంప్రదించిన ఉమాశంకర్, వినీష్ ఆడిటర్ సురేష్ మీద దాడి చేయాలని మాట్లాడుకున్నారు.
తరువాత సురేష్ మీద దాడి చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పి సుపారి కింద సందీప్ కు డబ్బులు ఇచ్చారని పోలీసులు తెలిపారు. అనుకున్న ప్రకారం సురేష్ మీద దాడి జరిగింది. అయితే దాడి జరిగిన తర్వాత బాధితుడు సురేష్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చెయ్యలేదు. అయితే ఆదాడి జరిగిన సమయంలో రికార్డు అయిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారడంతో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.
ఇదే సమయంలో సురేష్ మీద దాడికి గల కారణాలను బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. బెంగళూరులోని హెణ్ణూరులోని పోలీసులు కేసు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఆఫీస్ లో పని ఒత్తిడి కారణంగా అక్కడ పనిచేసే సిబ్బంది ఉన్నతాధికారులపై సుపారీ ఇచ్చి దాడి చేయించడం బెంగళూరులో కలకలం రేపింది. ఈ కేసు వివరాలు వినడానికి విడ్డూరంగా ఉందని బెంగళూరు పోలీసులు అంటున్నారు.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications