చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్
నక్సలైట్లతో జరిగిన ఈ పోరులో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ సహా ముగ్గురు జిల్లా రిజర్వు గార్డ్స్ సిబ్బంది మరణించారు
చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. నక్సలైట్లతో జరిగిన ఈ పోరులో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ సహా ముగ్గురు జిల్లా రిజర్వు గార్డ్స్ సిబ్బంది మరణించినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. రిజర్వ్ గార్డ్ బృందం సెర్చ్ ఆపరేషన్ లో ఉన్నప్పుడు జాగర్ గుండ, కుండేడ్ గ్రామాల మధ్య ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పీటీఐకి తెలిపారు.
రాజధాని రాయ్ పూర్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాగర్ గుండ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి ఈ బృందం ఆపరేషన్ ప్రారంభించిందని చెప్పారు. ఎదురు కాల్పుల్లో ఏఎస్ఐ రామురామ్ నాగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జోగా, సైనిక్ వంజం భీమా మృతిచెందారు. ఘటనా స్థలం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications