వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాలేజీ ప్రిన్సిపాల్ను నరికి చంపిన విద్యార్థులు
విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన వల్లనాడులోని ఇన్ఫాంట్ జీసస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ సురేష్ (55) ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచారు. ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
ర్యాగింగ్, ఇతర క్రమశిక్షణారహితమైన చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఆ ముగ్గురు విద్యార్థులను హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్ ఆదేశించినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని పోలీసులు చెప్పారు.
ప్రిన్సిపాల్ హత్య నేపథ్యంలో కళాశాలను గురువారం మూసివేశారు. టుటికోరిన్ పోలీసు సూపరింటిండెంట్ దురై సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
Comments
English summary
The principal of an engineering college in Tuticorin district was hacked to death in the college Thursday morning allegedly by three students who were ordered to vacate the hostel on grounds of indiscipline.
Story first published: Thursday, October 10, 2013, 12:26 [IST]