వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి హిందూ మహిళ నలుగుర్ని కనాలి: సాక్షి మహరాజ్

By Pratap
|
Google Oneindia TeluguNews

మీరట్: బిజెపి ఉన్నావో పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ మరో వివాదానికి తెర తీశారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు పార్లమెంటులో విచారం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన మానుకోలేదని అనిపిస్తోంది. ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలను కనాలని ఆయన సూచించారు.

శుక్రవారం మీరట్‌లో జరిగిన సంత్ సమాగమ్ మహోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఆ వ్యాఖ్య చేశారు. నలుగురు భార్యులు, 40 మంది పిల్లలు ఉండాలనే దృష్టికోణం భారతదేశంలో పనిచేయదని, హిందూ మతాన్ని రక్షించడానికి ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలకు జన్మ ఇవ్వాలని ఆయన అన్నారు. ఘర్ వాపసి మతమార్పిడులకు సమానమైంది కానప్పటికీ మతమార్పిడులకు పాల్పడేవారికి మరణ శిక్ష వేయాలని ఆయన అన్నారు.

 Every Hindu woman must produce at least 4 kids: Sakshi Maharaj

కాస్తా వేచి ఉండండని అంటూ గోహత్యకు పాల్పడినవారికి, మతమార్పిడులకు పాల్పడినవారికి మరణ శిక్ష విధించే చట్టాన్ని పార్లమెంటు చేస్తుందని ఆయన అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు.

ఘర్ వాపసీ కార్యక్రమాన్ని అపేది లేదని, అది నిరంతర ప్రక్రియ అని సాధ్వి ప్రాచీ అన్నారు. భారత్ ఇంతకు ముందు హిందూ దేశమని, ఇది హిందువులకు చెందిందని, హిందువులకే చెందుతుందని, హిందూయిజాన్ని స్వీకరించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

English summary
Sangh hotheads just won't be reined it. Despite reservations from the BJP leadership at the centre, which had to recently face considerable flak in both houses of Parliament in the aftermath of the Agra conversion controversy, Unnao MP Sakshi Maharaj has once again stirred a hornet's nest by saying all Hindu women must produce at least four children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X