ప్రతి హిందూ మహిళ నలుగుర్ని కనాలి: సాక్షి మహరాజ్
మీరట్: బిజెపి ఉన్నావో పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ మరో వివాదానికి తెర తీశారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు పార్లమెంటులో విచారం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన మానుకోలేదని అనిపిస్తోంది. ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలను కనాలని ఆయన సూచించారు.
శుక్రవారం మీరట్లో జరిగిన సంత్ సమాగమ్ మహోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఆ వ్యాఖ్య చేశారు. నలుగురు భార్యులు, 40 మంది పిల్లలు ఉండాలనే దృష్టికోణం భారతదేశంలో పనిచేయదని, హిందూ మతాన్ని రక్షించడానికి ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలకు జన్మ ఇవ్వాలని ఆయన అన్నారు. ఘర్ వాపసి మతమార్పిడులకు సమానమైంది కానప్పటికీ మతమార్పిడులకు పాల్పడేవారికి మరణ శిక్ష వేయాలని ఆయన అన్నారు.

కాస్తా వేచి ఉండండని అంటూ గోహత్యకు పాల్పడినవారికి, మతమార్పిడులకు పాల్పడినవారికి మరణ శిక్ష విధించే చట్టాన్ని పార్లమెంటు చేస్తుందని ఆయన అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు.
ఘర్ వాపసీ కార్యక్రమాన్ని అపేది లేదని, అది నిరంతర ప్రక్రియ అని సాధ్వి ప్రాచీ అన్నారు. భారత్ ఇంతకు ముందు హిందూ దేశమని, ఇది హిందువులకు చెందిందని, హిందువులకే చెందుతుందని, హిందూయిజాన్ని స్వీకరించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications