గర్ల్ని వేధించి పారిపోతూ బస్సు కింద పడి మృతి
బెంగళూరు: అమ్మాయి వెంటపడిన యువకుడు ప్రయాణికుల దగ్గర దెబ్బలు తిని చివరికి బస్సు చక్రాల కిందపడి దుర్మరణం చెందిన సంఘటన కర్ణాటకలోని తుమకూరు పట్టణంలో జరిగింది. తుమకూరు జిల్లా హిరియూరు పట్టణంలో నివాసం ఉంటున్న సందీప్ కుమార్ (21) మరణించాడు.
ఇతను హిరియూరు పట్టణంలోని జనతా బజార్ లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తుమకూరు నుండి మధుగిరికి వెళుతున్న ప్రయివేటు బస్సు ఎక్కాడు. ఆ బస్సులో తుమకూరులోని వివిధ కాలేజ్ లలో చదువుతున్న అమ్మాయిలు ఉన్నారు.

ఆ అమ్మాయిలు వారి సొంత ఊర్లకు వెళ్లడానికి ఆ బస్సు ఎక్కారు. కొంత సేపటి తరువాత సందీప్ కుమార్ ఒక అమ్మాయిని వేధించాడని సమాచారం. ఆ సందర్బంలో బస్సులో ఉన్న ప్రయాణికులు సందీప్ కుమార్ ను పట్టుకుని చితకబాదారు.
తరువాత సందీప్ కుమార్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే తుమకూరు పట్టణంలోని బాళేకట్టే ప్రాంతంలో సందీప్ కుమార్ బస్సులో నుండి కిందకు దూకాడు. ఆ సందర్బంలో అదే బస్సు వెనుక చక్రాలు అతని మీద దూసుకు వెళ్లడంతో అతను సంఘటనా స్థలంలో దుర్మరణం చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications