గుడ్ న్యూస్.. ఎమర్జెన్సీ కోసం కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిపుణుల కమిటీ ఓకే..
మరో గుడ్ న్యూస్.. నిన్న కోవిషిల్డ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చిన నిపుణుల కమిటీ ఇవాళ మరో నిర్ణయం తీసుకుంది. భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిక్కు కూడా పర్మిషన్ ఇచ్చింది. అత్యవసర సమయాల్లో ఈ రెండు వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తుది అనుమతి ఇవ్వాల్సి ఉంది. డీజీసీఐ అలో చేస్తే.. ఎమర్జెన్సీ సమయంలో ఇక డ్రగ్స్ ఇచ్చే ప్రక్రియ మొదలవుతోంది.
Recommended Video
కోవిషిల్డ్, కోవాక్సిన్తోపాటు క్రాడిలా హెల్త్ కేర్ అభివృద్ది చేస్తోన్న మూడో దశలో ఉంది. ఎమర్జెన్సీగా తీసుకొనేందుకు దీనికి కూడా నిపుణుల కమిటీ అంగీకారం తెలిపింది. శనివారం కరోనా వైరస్ వ్యాక్సిన్కి సంబంధించి అన్నీ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు డ్రై రన్ నిర్వహించాయి. తొలుత 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్రం తెలిపింది.
మరోవైపు 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి విడత వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వీరిలో కోటి మంది వైద్యారోగ్య సిబ్బంది అని.. 2 కోట్ల మంది పోలీసులు/ ఆర్మీ/ పారిశుద్ద్య కార్మికులు అని వివరించారు. దేశంలో 27 కోట్ల మందికి జూలై వరకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మిగతా 24 కోట్ల మందికి జూలై వరకు వ్యాక్సిన్ ఇస్తామని హర్షవర్ధన్ వివరించారు. దేశంలో కరోనా వైరస్ సోకి 1.49 లక్షల మంది చనిపోయారు.