yogi Adityanath: ఎగుమతుల హబ్గా యూపీ:యోగి ఆదిత్యనాథ్
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కార్యక్రమం ప్రతి జిల్లా ఉత్పత్తులను ప్రమోట్ చేయడమే కాకుండా, ప్రపంచ మార్కెట్కు యాక్సెస్తో పాటు కొత్త డిజైన్ను కూడా అందిస్తోందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శుక్రవారం లక్నోలోని లోక్ భవన్లో విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజన కింద జరిగిన అవార్డు, టూల్కిట్ పంపిణీ కార్యక్రమంలో యోగి పాల్గొన్నారు. ODOP U.P MSME రంగానికి వెన్నెముకగా మారిందన్నారు. ఇది మొత్తం దేశంలో స్వావలంబనకు నాంది పలికిందని చెప్పారు. నాల్గో పారిశ్రామిక విప్లవం (పారిశ్రామిక విప్లవం 4.0) టార్చ్ బేరర్గా ఉత్తరప్రదేశ్ ఉద్భవించనుందని తెలిపారు.
ఫిబ్రవరిలో లక్నోలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో అందుకున్న రూ. 35 లక్షల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను బట్టి ఇది స్పష్టమవుందన్నారు. "రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర బిందువు దాని 96 లక్షల MSMEలు (సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)" అని ముఖ్యమంత్రి చెప్పారు. MSME ఉత్పత్తులను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో డిజైనింగ్, ప్యాకేజింగ్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఈ అవార్డు కార్యక్రమంలో పన్నెండు మందికి సంత్ కబీర్ స్టేట్ హ్యాండ్లూమ్ అవార్డు, 34 సంస్థలకు స్టేట్ ఎక్స్పోర్ట్ అవార్డు, 20 మందికి MSME లభించాయి. విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజన కింద శిక్షణ పొందిన 75,000 మంది కళాకారులకు టూల్కిట్లు, సర్టిఫికెట్లు అందించారు.
ప్రపంచ స్థాయిలో రాష్ట్రంలోని హస్తకళాకారులకు ODOP గౌరవాన్ని తెచ్చిపెట్టిందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ నేడు ఎగుమతుల హబ్గా ఆవిర్భవించిందని చెప్పారు.
2017కి ముందు ఎగుమతులు కేవలం రూ.86,000 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు అది రూ.2.5 లక్షల కోట్లకు పెరిగిందని ముఖ్యమంత్రి యోగి తెలిపారు. విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజనతో బ్యాంకులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా చేతివృత్తిదారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఆర్థిక సహాయం పొందవచ్చని ఆయన చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బ్యాంకర్లతో విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజనకు సంబంధించిన కళాకారుల సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications