వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడాబాబుల రుణాలు మాఫీ చేసినప్పుడు..రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయరు: రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: రైతుల మంచి భవిష్యత్తు కోసం అన్ని విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి రైతులకు అండగా నిలుస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పార్లమెంటును ముట్టడికి బయలు దేరుతుండగా అన్ని ద్వారాలు అధికారులు మూసివేశారు. జంతర్ మంతర్ దగ్గర రైతులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశంలోని రైతుల గొంతును యువత గొంతును ఎవరూ నొక్కి పట్టుకోలేరని అన్నారు. భారత ప్రభుత్వం రైతులను, యువతను అవమానిస్తే కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని రాహుల్ అన్నారు.

రైతులు ప్రభుత్వం నుంచి ఏదీ బహుమానంగా అడగడం లేదని వారి డిమాండ్లు న్యాయపరమైనవని అన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించి రూ. 3.5 లక్షల కోట్లు రుణాలను మాఫీ చేయగలిగినప్పుడు రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయలేకపోతోందని ప్రశ్నించారు. గురువారం నుంచి చలికి రాంలీలా మైదానంలోనే రైతులు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు ముట్టడికి బయలుదేరిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

Farmers not seeking free gifts from govt, says Rahul Gandhi at Delhi rally

దేశ నలుమూలల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో రైతులు తమ నిరసన వ్యక్తం చేసేందుకు ఢిల్లీ చేరుకున్నారు.

English summary
The leaders of all opposition parties stand united with farmers in ensuring their good future, Congress president Rahul Gandhi said on Friday and called for a farm loan waiver.Addressing a gathering of protesting farmers at Jantar Mantar, he said no one will be able to silence the voice of farmers and youth. If the Indian government insults them, then they will ensure its removal, Gandhi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X