బడాబాబుల రుణాలు మాఫీ చేసినప్పుడు..రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయరు: రాహుల్ గాంధీ
ఢిల్లీ: రైతుల మంచి భవిష్యత్తు కోసం అన్ని విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి రైతులకు అండగా నిలుస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పార్లమెంటును ముట్టడికి బయలు దేరుతుండగా అన్ని ద్వారాలు అధికారులు మూసివేశారు. జంతర్ మంతర్ దగ్గర రైతులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశంలోని రైతుల గొంతును యువత గొంతును ఎవరూ నొక్కి పట్టుకోలేరని అన్నారు. భారత ప్రభుత్వం రైతులను, యువతను అవమానిస్తే కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని రాహుల్ అన్నారు.
రైతులు ప్రభుత్వం నుంచి ఏదీ బహుమానంగా అడగడం లేదని వారి డిమాండ్లు న్యాయపరమైనవని అన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించి రూ. 3.5 లక్షల కోట్లు రుణాలను మాఫీ చేయగలిగినప్పుడు రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయలేకపోతోందని ప్రశ్నించారు. గురువారం నుంచి చలికి రాంలీలా మైదానంలోనే రైతులు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు ముట్టడికి బయలుదేరిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

దేశ నలుమూలల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో రైతులు తమ నిరసన వ్యక్తం చేసేందుకు ఢిల్లీ చేరుకున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications