Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెల్లవారు జామున 6 నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్..

Farmers' protest 2024: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోసారి ఉత్తరాది రైతులు ఉద్యమించనున్నారు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు.

2021లో రైతుల ఆందోళన రోజుల తరబడి సాగిన విషయం తెలిసిందే. దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన దీక్షలను కొనసాగించారు. ఏడాదికాలం పాటు వారంతా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలను కొనసాగించారు. ఇప్పుడు మరోసారి రోడ్డెక్కడానికి సిద్ధపడ్డారు. ఈ నెల 13వ తేదీన ఛలో ఢిల్లీ ఆందోళనకు పిలుపునిచ్చారు.

Farmers protest 2024: Mobile internet services has suspended in these districts from February 11

కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా.. వంటి 200లకు పైగా రైతు సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఛలో ఢిల్లీ ఆందోళనలో మూడు లక్షల మంది వరకు రైతులు పాల్గొనే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్.. వంటి రాష్ట్రాల నుంచి 500లకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీకి తరలి వెళ్లనున్నారు రైతులు. దీనికోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు గతంలో తాము ప్రతిపాదించిన తమ డిమాండ్లను పరిష్కరించాలని పట్టుబట్టుతున్నారు.

Farmers protest 2024: Mobile internet services has suspended in these districts from February 11

కేంద్రమంత్రులు పియూష్ గోయెల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్‌తో కూడిన కమిటీ.. రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన తొలి విడత చర్చలు విఫలం అయ్యాయి. అర్ధాంతరంగా ముగిశాయి. రైతు నాయకులు పెట్టిన డిమాండ్లపై ఈ కమిటీ అప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఛలో ఢిల్లీ ఆందోళలను విరమించుకోవడానికి నిరాకరించారు.

దీనితో ఈ నెల 13వ తేదీన తలపెట్టిన ఛలో ఢిల్లీ ఆందోళనను యథాతథంగా కొనసాగించాలని తీర్మానించారు. ఈ నేపథ్యంలో- హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. అంబాలా, కురుక్షేత్ర, కైథల్, జింద్, హిసార్, ఫతేబాద్, సిర్సా.. వంటి జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Farmers protest 2024: Mobile internet services has suspended in these districts from February 11

మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్, మొబైల్ నెట్ వర్క్ కంపెనీలు ప్రొవైడ్ చేసే డోంగల్ సర్వీసులను ఆదివారం తెల్లవారు జామున 6 గంటల నుంచి నిలిపివేయనున్నట్లు తెలిపింది. 13వ తేదీ అర్ధరాత్రి 11:59 నిమిషాల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+