యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్లో ఐదుగురు మృతి..
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అజాంఘర్ సమీపంలోని టప్పాల్ వద్ద డబుల్ డెక్కర్ బస్సు, ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంబవించింది. నిన్న (బుధవారం, నవంబర్ 20) అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో స్పాట్లో ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా, మరో 15 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఢిల్లీ నుంచి అజాంఘడ్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైంది. తప్పల్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఖాళీ బీర్ల సీసాల ట్రక్కును ఈ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఐదుగురు అక్కడిక్కడే చనిపోయారు. మృతిచెందినవారిలో ఓ పసికందు, మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తుక్కుతుక్కయిన బస్సు..
ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగమంతా తుక్కుతుక్కయ్యింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని అతికష్టం మీద బయటకు తీశారు. గాయపడిన వారిని జెవార్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాచారం అందుకున్న టప్పాల్ పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదుగురు మృత దేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications