Budget 2024: నేడే కేంద్ర బడ్జెట్: నిర్మలా సీతారామన్ రికార్డు, ఆశలకు రెక్కలొచ్చేనా?
న్యూఢిల్లీ: మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. మంగళవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గతంతో పోలిస్తే బీజేపీకి లోక్సభ స్థానాలు తగ్గడం, త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బడ్జెట్లో జనాకర్షక నిర్ణయాలు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా లబ్ధిదారులు, బీమా మొత్తం పెంపు, ఆదాయపు పన్ను విషయంలో ఉపశమనాలు సహా సామాజిక, సంక్షేమ వ్యయాలను పెంచే అవకాశాలున్నాయి. కొత్త పద్దులో అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు, ఈ బడ్జెట్పై చాలా రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. ఇక, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైతే నిధుల కేటాయింపులపై మరిన్ని ఆశలు పెట్టుకున్నాయి. అయితే, పార్లమెంటులో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పనున్నారు.
నిర్మలా సీతారామన్ 2019, మే 30 నుంచి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. ఆమె ఇప్పటి వరకు వరుసగా ఏడుసార్లు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతంలో వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరు మీదున్న రికార్డును నేటితో నిర్మలా సీతారామన్ చెరిపేయనున్నారు. మరోవైపు, సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్పైనే ఉంది. 2020 ఫిబ్రవరి 1 బడ్జెట్ను బడ్జెట్ ప్రవేశపెడుతూ 2 గంటల 40 నిమిషాలు ప్రసంగించారు
కాగా, మంగళవారం ఉదయం 9 గంటలకు ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్నారు మంత్రి నిర్మలా సీతారామన్. 9.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకుంటారు. మంగళవారం ఉదయం 10.15 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది.
VIDEO | Parliament Budget Session: "A lot of steps have been taken on Ease of Doing Business. Nearly 11 steps have been mentioned in the reply, but most importantly decriminalisation of 63 major offences and as a result of which companies today are able to carry on their… pic.twitter.com/JFzQozOnyG
— Press Trust of India (@PTI_News) July 22, 2024
కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ఉదయం 11 గంటలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2023-24ను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. సర్వే వివరాలను వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సారానికిగాను దేశ వాస్తవ జీడీపీ 6.5-7 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. బడ్జెట్ 2024-25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. దాదాపు 11 దశల్లో దీనిపై చర్చలు జరిగాయని తెలిపారు. ముఖ్యంగా 63 నేరాలను డీక్రిమినలైజేషన్ చేయడం వల్ల ప్రస్తుతం కంపెనీలు సమర్థంగా కొనసాగుతున్నాయని ఆమె వివరించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications