Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలపై కేసులు: ఇదే కారణమన్న అస్సాం సీఎం హిమంత

గౌహతి: అస్సాంలో ఘర్షణలు సృష్టించినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై పోలీసు కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో హింస, రెచ్చగొట్టడం, దాడి చేసినందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం తెలిపారు.

మంగళవారం తెల్లవారుజామున అస్సాంలోని గౌహతిలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుండగా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శనివారం జరిగిన మార్చ్‌పై 'బీజేపీ గూండాలు' దాడి చేశారని ఆరోపిస్తూ అస్సాంలో జరిగిన ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శల దాడి చేసింది.

FIR Lodged Against Rahul Gandhi, Other Congress Leaders For Violence In Assam: CM Himanta Biswa Sarma

సోషల్ మీడియా పోస్ట్‌లో హిమంత శర్మ మాట్లాడుతూ, "కాంగ్రెస్ సభ్యులు ఈ రోజు హింసాత్మక చర్యలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసులపై దాడి చేయడం వంటి చర్యలను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర వ్యక్తులపై PDPP చట్టంలోని సెక్షన్ 120(B)143/147/188/283/353/332/333/427 IPC R/W సెక్షన్ 3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది' అని అస్సాం సీఎం పేర్కొన్నారు.

బారికేడ్లను బద్దలు కొట్టేందుకు "జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు" గాంధీపై కేసు నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ముఖ్యమంత్రి ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ కేసు నమోదైంది. 'జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు మీ నాయకుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని నేను డీజీపీని ఆదేశించాను' అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ ట్విట్టర్ పోస్ట్‌పై ముఖ్యమంత్రి స్పందించారు.

రాహుల్ గాంధీపై రాష్ట్ర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేస్తారని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయనను అరెస్టు చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం ప్రకటించారు. ఖానాపరా ప్రాంతంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఘటన తరువాత.. రాహుల్ గాంధీ సుమారు 3000 మంది వ్యక్తులు, 200 వాహనాలతో గౌహతిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని సీఎం ఆరోపించారు.

గౌహతిలో 3000 మంది, 200 వాహనాలు వస్తే పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఆరు రోజులుగా మేం ఆయనకు సౌకర్యంగా ఉన్న మార్గంలో వెళ్లమని చెబుతున్నాం కానీ, గౌహతి మధ్య మార్గంలో వెళ్లవద్దని చెప్పాం. దీంతో వారు (కాంగ్రెస్ కార్యకర్తలు) పోలీసులతో ఘర్షణ పడ్డారు' అని అస్సాం ముఖ్యమంత్రి మీడియాకు తెలిపారు. కాగా, మణిపూర్ నుంచి అస్సాంలో ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 25 వరకు అస్సాంలో కొనసాగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+