Car bomb: కారు బాంబు పేలుడులో ట్విస్ట్, ఎన్ఐఏ పంజా, ముగ్గురికి బాదాం హల్వా !
కోయంబత్తూరు/చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలో జరిగిన కారు పేలుడు కేసులో ఎన్ఐఏ అధికారులు పంజా విసిరారు. శివుడి గుడి సమీపంలో జరిగిన కారు పేలుడులో జమేష్ ముబిన్ అనే వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇదే కేసులో అనేక మందిని అధికారులు విచారణ చేశారు. ఇప్పుడు మరో ముగ్గురిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
కోయంబత్తూరు కారు పేలుడు కేసులో మరో ముగ్గురు అరెస్టు అయ్యారు. అక్టోబర్ 23వ తేదీన వేకువ జామున కోయంబత్తూరులోని ఉక్కడం దేవాలయం సమీపంో కారులో పేలుడు సంభవించింది. అక్టోరబ్ 27వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కోయంబత్తూరు కారు పేలుడు కేసును ఎన్ఐఏ అధికారులకు అప్పగించారు.

ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు 9 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో బుధవారం ఎన్ఐఏ అధికారులు ఫిరోజ్ ఖాన్ (28), మోహమ్మద్ తైఫిక్ (25), ఉమర్ ఫారూక్ (39) అనే అనే ముగ్గురిని అరెస్టు చేశారు. బుధవారం ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు.
అక్టోబర్ 23వ తేదీన వేకువ జామున కోయంబత్తూరులో కారు పేలుడు జరగడంతో ప్రజలు హడలిపోయారు. ప్రసిద్ది చెందిన ఆలయం సమీపంలో కారు పేలుడు జరగడంతో మెదట కారులోని గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఉంటుందని అనుకున్నారు. అయితే జమేష్ ముబిన్ ఇంటిలో పేలుడు పదార్థాలు చిక్కడంతో కథ మలుపు తిరిగింది.












Click it and Unblock the Notifications