Car bomb: కారు బాంబు పేలుడులో ట్విస్ట్, ఎన్ఐఏ పంజా, ముగ్గురికి బాదాం హల్వా !
కోయంబత్తూరు/చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలో జరిగిన కారు పేలుడు కేసులో ఎన్ఐఏ అధికారులు పంజా విసిరారు. శివుడి గుడి సమీపంలో జరిగిన కారు పేలుడులో జమేష్ ముబిన్ అనే వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇదే కేసులో అనేక మందిని అధికారులు విచారణ చేశారు. ఇప్పుడు మరో ముగ్గురిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
కోయంబత్తూరు కారు పేలుడు కేసులో మరో ముగ్గురు అరెస్టు అయ్యారు. అక్టోబర్ 23వ తేదీన వేకువ జామున కోయంబత్తూరులోని ఉక్కడం దేవాలయం సమీపంో కారులో పేలుడు సంభవించింది. అక్టోరబ్ 27వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కోయంబత్తూరు కారు పేలుడు కేసును ఎన్ఐఏ అధికారులకు అప్పగించారు.

ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు 9 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో బుధవారం ఎన్ఐఏ అధికారులు ఫిరోజ్ ఖాన్ (28), మోహమ్మద్ తైఫిక్ (25), ఉమర్ ఫారూక్ (39) అనే అనే ముగ్గురిని అరెస్టు చేశారు. బుధవారం ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు.
అక్టోబర్ 23వ తేదీన వేకువ జామున కోయంబత్తూరులో కారు పేలుడు జరగడంతో ప్రజలు హడలిపోయారు. ప్రసిద్ది చెందిన ఆలయం సమీపంలో కారు పేలుడు జరగడంతో మెదట కారులోని గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఉంటుందని అనుకున్నారు. అయితే జమేష్ ముబిన్ ఇంటిలో పేలుడు పదార్థాలు చిక్కడంతో కథ మలుపు తిరిగింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications