వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఒక మహిళ, ఓ చిన్నారి ఉన్నారు. కరోల్‌బాగ్ ప్రాంతంలోని హోటల్ అర్పిత్ ప్యాలెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్నవారు బయటకు పరుగులు పెట్టారు. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు ఫైర్ యాక్సిడెంట్ సంభవించడంతో మృతుల సంఖ్య ఎక్కువయింది. అందరూ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 20 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు. హోటల్‌లో చిక్కుకున్న 50 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Fire breaks out at hotel in Delhi Karol Bagh area, 9 persons died

ఢిల్లీలో ఇటీవల అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటం చర్చానీయాంశమైంది. సరిగ్గా నెలరోజు కిందట వెస్ట్ ఢిల్లీలో జరిగిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. కీర్తి నగర్ లోని ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు క్షణాల్లో దావానంలా వ్యాపించాయి. దీంతో ఎగిసిపడ్డ అగ్నికీలలు పక్కనే ఉన్న మురికివాడకు వ్యాపించాయి. పేదలు నివాసముండే గుడిసెలు, ఇళ్లు 100 వరకు కాలి బూడిదయ్యాయి. దీంతో అందులో నివసిస్తున్నవారు నిరాశ్రయులయ్యారు.

English summary
Nine persons, including a woman and a child were charred to death, and several others injured after a massive fire broke out at a hotel in Delhi’s Karol Bagh area on Tuesday morning at around 4:30 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X