అగ్ని ప్రమాదం: హృతిక్, అక్షయ్ల ఆఫీస్లు (పిక్చర్స్)
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ 22 అంతస్థుల భవంతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంధేరీలోని లోటస్ బిజినెస్ పార్కు భవనంలో ఈ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 21వ అంతస్తు నుండి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి.
అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రమాదం ఉదయం చోటు చేసుకుంది. మంటలు 20, 22 అంతస్తులకు కూడా వ్యాపించాయి. ఈ భవంతిలో పలు కార్యాలయాలు ఉన్నాయి. బాలీవుడ్ ప్రముఖుల కార్యాలయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ కార్యాలయం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే హృతిక్ రోషన్కు చెందిన మూడు కార్యాలయాలు ఉన్నాయని సమాచారం.
ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒక ఫైర్ మాన్ మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఉద్యోగులను సురక్షితంగా బయటకు పంపించారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకు పోయారు. దీంతో వారిని రక్షించేందుకు హెలికాప్టర్ సాయం తీసుకున్నారు. నావీ, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్స్ రంగంలోకి దిగాయి. 30 మంది చిక్కుకోగా 29 మందిని రక్షించారు. ఒకరు మృతి చెందారు.
ఉదయం పదకొండు గంటల సమయంలో ఓ కమర్షియల్ భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్లుగా ఫోన్ వచ్చిందని, ఇది గ్రేడ్ 1 ప్రమాదంగా భావించిన తాము తొలుత నాలుగు ఫైర్ ట్యాంకర్లను పంపించామని, ప్రమాదం తీరు చూసి గ్రేడ్ 2ది అని తెలిశాక మరో 12 ఫైరింజన్లను పంపించామని, తొమ్మిది నీళ్ల ట్యాంకర్లను ఉంచామని ఫైర్ బ్రిగేడ్ అధికారి ఒకరు పీటీఐతో చెప్పారు.
అగ్ని ప్రమాదం
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని 22 అంతస్తుల భారీ భవంతిలో శుక్రవారం ఉదయ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 21 అంతస్తులో మంటలు వచ్చాయి.
అగ్ని ప్రమాదం
భవనంలోని మంటలను చల్లార్చేందుకు సంఘటన స్థలానికి ఉదయం 12 ఫైరింజన్లు, తొమ్మిది నీటి ట్యాంకర్లను రప్పించారు. మంటలను ఆర్పివేస్తున్నారు.
హెలికాప్టర్
భవనంలోని మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది, భవనంలో ఉన్న వారందర్నీ రక్షించారు. అయితే, వారు భవనంలో చిక్కుకు పోవడంతో హెలికాప్టర్ను రంగంలోకి దించారు.
ప్రమాదం
ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.