ఉగ్ర ఘాతుకమే: ఆర్మీ వాహనంపై గ్రెనెడ్లతో దాడి, ఐదుగురు సైనికులు సజీవ దహనం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంచ్-జమ్మూ హైవేపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆర్మీ వాహనం మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు జవాన్లు సజీవదహనమయ్యారు. ఆర్మీ వాహనం పూంచ్ జిల్లాలోని భింబర్ గలి నుంచి సాంగ్యోట్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, తక్కువ దృశ్యమానతను ఉపయోగించుకున్న గుర్తుతెలియని ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపారని నార్తర్న్ కమాండ్ తెలిపింది. ఉగ్రవాదులు గ్రెనేడ్లు ప్రయోగించడం వల్ల వాహనం మంటల్లో చిక్కుకుందని వెల్లడించారు.

'కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ల కోసం మోహరించిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్కు చెందిన ఐదుగురు సిబ్బంది దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో సైనికుడిని వెంటనే రాజౌరీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు' అని నార్తర్న్ కమాండ్ పేర్కొంది. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కాలిపోతున్న ట్రక్కు పక్కన రోడ్డుపై పడి ఉన్న సైనికుల మృతదేహాలకు సంబంధిచిన వీడియోలు వైరల్ అయ్యాయి. స్థానికులు, ఆర్మీ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మొదట ఈ దారుణమైన దాడి పిడుగుపాటు అనుకున్నప్పటికీ.. విచారణలో ఉగ్రదాడిగా అధికారులు తేల్చారు. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
కాగా, గత ఏడాది డిసెంబరులో రాజస్థాన్లోని ఉదయపూర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియన్ ఆర్మీ ట్రక్కులో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగాయి. ఉదయపూర్లోని మిలటరీ స్టేషన్కు వెళుతున్న ఐదు వాహనాల కాన్వాయ్లో ట్రక్కు భాగంగా ఉంది. అయితే, సిబ్బంది, ప్రాణ నష్టం జరగలేదు.
VIDEO | Indian Army vehicle catches fire in Jammu and Kashmir's Poonch sector. More details are awaited. pic.twitter.com/E4gyvthM54
— Press Trust of India (@PTI_News) April 20, 2023
2021లో రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో వారు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం బోల్తా పడి మంటలు చెలరేగడంతో ముగ్గురు సైనికులు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గత వారం, భటిండాలోని మిలిటరీ స్టేషన్లో జరిగిన కాల్పుల్లో నలుగురు సైనికులు నిద్రలోనే మరణించారు. సిబ్బంది తమ గదుల్లో నిద్రిస్తుండగా, తెల్లటి కుర్తా పైజామాలో ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు రైఫిళ్లు, పదునైన ఆయుధాలతో వారిపై దాడి చేశారు.
నలుగురు జవాన్లు వారి గదుల్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఘటనా స్థలం నుంచి INSAS రైఫిల్కు చెందిన 19 ఖాళీ షెల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దేశాయ్ మోహన్ అనే ఆర్మీ జవాన్ను అరెస్టు చేశారు. భటిండా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా ఉద్దేశ్యం వ్యక్తిగతమని, మోహన్కి వారితో శత్రుత్వం ఉందని చెప్పారు.
ఒక రోజు తర్వాత, భటిండా మిలిటరీ స్టేషన్లో సర్వీస్ తపాకీ ప్రమాదవశాత్తూ పేలిపోవడంతో మరో జవాన్ మరణించాడు. అయితే, ఈ రెండు ఘటనల మధ్య ఎలాంటి సంబంధం లేదని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. రెండో ఘటన ఆత్మహత్యాయత్నంగా అనుమానిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications