దాణా కుంభకోణం: నాలుగో కేసులో తీర్పు నేడే
రాంచీ : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై మరో కేసులో తీర్పు గురువారం వెలువడబోతోంది. స్పెషల్ సీబీఐ కోర్టు దాణా కుంభకోణంలోని నాలుగో కేసులో తీర్పు చెప్పబోతోంది.
1995 డిసెంబరు నుంచి 1996 జనవరి మధ్యలో డుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లు మోసపూరితంగా ఉపసంహరించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో విచారణ ఈ నెల 5న ముగిసింది.

ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్తోపాటు బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా, మరో 30 మంది నిందితులుగా ఉన్నారు. దాణా కుంభకోణం కేసుల్లోని మొదటి కేసులో తీర్పు 2013లో వెలువడింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్కు ఐదేళ్ళ జైలు శిక్ష విధించారు.
2017 డిసెంబరు 23న రెండో కేసులో తీర్పు వెలువడింది. దీనిలో లాలూకు మూడున్నరేళ్ళ జైలు శిక్ష విధించారు. ఇక మూడో కేసులో తీర్పు ఈ ఏడాది జనవరి 24న వెలువడింది. దీనిలో ఆయనకు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.
ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్పై రాంచీలో ఒక కేసు, పాట్నాలో మరొక కేసు విచారణలో ఉన్నాయి. నాలుగోదైన డుమ్కా ట్రెజరీ కేసులో విచారణ ఇప్పటికే ముగియడంతో గురువారం ఈ కేసులో తీర్పు వెలువడనుంది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications