కేఎం జోసెఫ్ పేరు ప్రతిపాదన: కొలీజియం భేటీకి జస్టిస్ చలమేశ్వర్ వినతి
ఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్రానికి అత్యవసరంగా సిఫారసు చేసేందుకు కొలీజియం సమావేశం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కోరారు.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్మిశ్రాకు జస్టిస్ చలమేశ్వర్ లేఖ రాశారు.
జస్టిస్ జోసఫ్ను సుప్రీం న్యాయమూర్తిగా నియమించాలని జస్టిస్ చలమేశ్వర్ తన లేఖలో పునరుద్ఘాటించినట్లు సర్వోన్నత న్యాయస్థానం అధికారవర్గాలు తెలిపాయి.

జస్టిస్ జోసఫ్ నియామకానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు ఈ లేఖలో ఆయన సమాధానమిచ్చినట్లు వెల్లడించారు. సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ జోసఫ్ పేరును కొలీజియం సిఫార్సు చేసిన జనవరి 10 నుంచి నేటి వరకు పరిస్థితులు ఏమీ మారనందున ఆయనను నియమించాలని కోరినట్లు తెలిపాయి.
కోలీజియం సిఫార్సుల్ని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం సీనియారిటీ సహా పలు ఇతర కారణాలను చూపుతూ జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును గతనెలలో తిప్పిపంపింది. కాగా, జస్టిస్ చలమేశ్వర్ లేఖ నేపథ్యంలో కొలీజియం సమావేశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయం తీసుకోనున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications