గ్యాంగ్స్టర్ భార్యతో గ్యాంగ్లోని సభ్యుడు అఫైర్.. ఒక రోజు అలా చేస్తుండగా..!
సినిమా కథను తలపించే ఉదంతం మహారాష్ట్రలోని నాగపూర్లో చోటుచేసుకుంది. ఒక గ్యాంగ్స్టర్ ప్రధాన పాత్రలో ప్రేమ, ద్రోహం, మరణం పెనవేసుకున్న ఈ ఉదంతం అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్యాంగ్ నాయకుడు, అతని భార్య, అదే గ్యాంగ్లో సభ్యుడైన ఒక వ్యక్తి. అనుకోని మలుపులతో, ఈ త్రికోణ ప్రేమకథ ఒక విషాద ముగింపుకు దారితీసింది. మరి పర్యవసానం ఏమయ్యిందంటే..
అసలేం జరిగింది?
నాగపూర్లోని ఒక పేరుమోసిన గ్యాంగ్లో సభ్యుడైన అర్షద్ టోపీకి, తమ గ్యాంగ్ నాయకుడి భార్యతో రహస్యంగా ప్రేమాయణం సాగింది. ఈ విషయం మెల్లగా గ్యాంగ్లోని ఇతర సభ్యులకు కూడా తెలిసింది. ఈ రహస్య సంబంధం కొనసాగుతున్న తరుణంలోనే, గ్యాంగ్ నాయకుడి భార్య అనుకోని పరిస్థితుల్లో మరణించింది. ఆమె మరణవార్త గ్యాంగ్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఇప్పా గ్యాంగ్కు చెందిన 40 మంది సభ్యులు, టోపీని ద్రోహిగా ప్రకటించి, అతన్ని చంపడానికి సిద్ధమయ్యారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, టోపీనే హత్య చేశాడని గ్యాంగ్ సభ్యులు బలంగా నమ్మారు. దీంతో టోపీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘటన నాగపూర్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సంఘటనలు సినిమాల్లో మాత్రమే చూస్తామని, కానీ నిజ జీవితంలోనూ ఇలాంటివి జరుగుతాయని ఈ ఉదంతం రుజువు చేసింది.

అర్షద్ టోపీ, గ్యాంగ్స్టర్ భార్య ఒక బైక్పై వెళ్తుండగా.. వారి బైక్ను ప్రమాదవశాత్తు ఒక జేసీబీ యంత్రం ఢీకొట్టిందని నాగ్ పూర్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అర్షద్ టోపీకి స్వల్ప గాయాలయ్యాయి. కానీ మహిళ తీవ్రంగా గాయపడింది. పోలీసుల పెట్రోలింగ్ వాహనం సంఘటన స్థలానికి చేరుకుంది. వారు మహిళను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఆస్పత్రి ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించింది. తర్వాత ఆమెను కామటిలోని మరొక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆమెను చేర్చుకోలేదు. చివరకు అర్షద్ టోపీ ఒక అంబులెన్స్ డ్రైవర్కు డబ్బులు ఇచ్చాడు. అప్పుడే ఆ మహిళను నాగ్పూర్లోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. శుక్రవారం ఉదయం ఆమె ఆస్పత్రిలో మరణించింది. ప్రభుత్వాసుపత్రి సీసీటీవీ ఫుటేజీలో అర్షద్ టోపీ గాయపడిన మహిళతో కనిపించాడు.
ఇప్పా గ్యాంగ్ అర్షద్ టోపీ కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. వారు టోపీని ఖతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గ్యాంగ్ లీడర్ భార్య హత్య ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. టోపీనే హత్య చేశాడని గ్యాంగ్ భావిస్తోంది. ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన అర్షద్ టోపీ శుక్రవారం పార్డిలోని డీసీపీ కార్యాలయానికి రక్షణ కోసం చేరుకున్నాడు. పరిస్థితిని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని డీసీపీ అతడిని కోరాడి పోలీస్ స్టేషన్కు పంపారు. అక్కడ అతని వాంగ్మూలం నమోదు చేయబడిందని డీసీపీ వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో మహిళ మరణం ఒక ప్రమాదంలోనే జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఆమె హత్య చేయబడిందనడానికి ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లేవు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications