ప్రియుడితో పారిపోయిన యువతి, నమ్మించి పలుమార్లు బావ రేప్
మజఫర్ నగర్: ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్లో ఓ 19 ఏళ్ల యువతి తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ప్రియుడు, ప్రియురాలు వేర్వేరు కమ్యూనిటీకి చెందిన వారు. పారిపోయిన ఆ ప్రేమికులు జనవరి 24వ తేదీన పెళ్లి చేసుకోవచ్చని చెబుతున్నారు. వారు సోమవారం పారిపోయారు.
యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడు తమ కూతురును ఎత్తికెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరిని వెతికుతున్నామని పోలీసు అధికారులు చెప్పారు.
పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నం
ముజఫర్ నగర్ జిల్లాలోని సుజ్రూ గ్రామంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. తాను ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె సోమవారం విషం తాగింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని పోలీసులు మంగళవారం చెప్పారు.
తనకు కొద్ది రోజులుగా తన బావతో సంబంధం ఉన్నట్లు ఆమె పేర్కొంది. తన భర్త మృతి చెందిన అనంతరం బావతో రిలేషన్షిప్ ఏర్పడినట్లు పోలీసులకు చెప్పింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు తన పైన అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. జనవరి 5వ తేదీన పెళ్లి ముహూర్తం పెట్టడంతో తాను నమ్మానని, కానీ చేసుకోలేదని, చెప్పింది. దీంతో తాను ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పింది.