రామ్దేవ్ పతంజలి హాస్టల్నుండి ఢిల్లీ యువతి అదృశ్యం

యువతి తల్లిదండ్రులతో పాటు సదరు హాస్టల్ అధికారులు విడివిడిగా ఫిర్యాదులు దాఖలు చేయడంతో శుక్రవారమే ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ యువతి కోసం బల్జీత్ అనే ఒక వ్యక్తి తరచూ హాస్టల్కు వస్తుండేవాడని, అతడిని పెళ్లి చేసుకోనున్నట్టు ఆమె చెబుతూ ఉండేదని స్నేహితులు ప్రాథమిక విచారణలో వెల్లడించారని చెప్పారు.
ఈ వివరాలను బట్టి చూస్తే ఆమె అతనితో కలసి పారిపోయి ఉంటుందని అనుమానిస్తున్నామని సక్లానీ తెలిపారు. గురువారం కూడా అతను హాస్టల్కు వచ్చినట్లు కొందరు చెప్పారన్నారు. కాగా, ఢిల్లీలోని గీతాంజలి పార్కు ప్రాంతంలో నివసించే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications