వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలేజ్ విద్యార్థిని కిడ్నాప్: ఎస్కేప్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లో అందరూ చూస్తున్న సమయంలోనే దుండగులు కాలేజ్ విద్యార్థిని కిడ్నాప్ చేశారు. కాలేజ్ దగ్గర, మార్గం మద్యలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని క్లిప్పింగ్ లు పరిశీలించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుర్గావ్ నగరంలోని ఎంజీ రోడ్డులోని గురు ద్రోణాచార్య కాలేజ్ దగ్గరకు ఓ విద్యార్థిని వెళ్లింది. అదే సమయంలో కారులో వచ్చిన నలుగురు నిందితులు అందరూ చూస్తుండగానే ఆమెను కిడ్నాప్ చేసి కారులో తీసుకు వెళ్లారు.

అక్కడ ఉన్న వారు విద్యార్థినిని రక్షించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. మార్గం మద్యలో విద్యార్థిని కారు డోర్ ను గట్టిగా కాలితో తన్నడంతో డోర్ తెరుచుకుంది. అక్కడున్న ఇద్దరు యువకులు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు.

వీలు కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరాల్లోని క్లిప్పింగ్స్ పరిశీలించి నాకాబంధి కొనసాగించారు. కొన్ని గంటల వ్యవధిలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
Hours after a student was dragged into a car from outside a college in Gurgaon near Delhi on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X