Girl: అమ్మాయి మీద యాసిడ్ దాడి, సీసీటీవీల్లో ?, టైమ్ చూసి, ముగ్గురు కిరాతకులు అందర్, ఏం జరిగింది ?
న్యూఢిల్లీ: నైరుతి ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయి, 13 ఏళ్ల వయసు ఉన్న అక్కాచెల్లెలు నివాసం ఉంటున్నారు. ఢిల్లీలోని ఓ స్కూల్ లో అక్కాచెల్లి చదువుకుంటున్నారు. ఇంటి నుంచి ఒకేసారి బయలుదేరి వెలుతున్న అక్కాచెల్లి మెట్రోలో ప్రయాణించి స్కూల్ కు వెలుతున్నారు. ఉదయం అక్క మీద కిరాతకులు యాసిడ్ పోయడం కలకలం రేపింది.
దేశరాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరగడంతో దేశవ్యాప్తంగా ప్రజలు హడలిపోయారు. యాసిడ్ దాడికి గురైన 17 ఏళ్ల అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. యువతి ముఖం మీద యాసిడ్ పోయ్యడంతో యాసిడ్ ఆమె కళ్లలోకి వెళ్లిందని వైద్యులు చెప్పారు. తనను యువకులు వేదిస్తున్నారని ఇంతకాలం మా కూతురు చెప్పలేదని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.
అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసు అధికారులు పరిశీలించారు. ఉదయం 9 గంటల సమయంలో అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు ఎన్నిసార్లు సంచరించారు అని పోలీసులు ఆరా తీశారు.
Father: తండ్రిని 30 ముక్కలుగా నరికేసిన కొడుకు, సొంత ఫామ్ హౌస్ లో బోర్ బావిలో వేసి కూల్ గా!
సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ ఆధారంగా, యువతిని రహస్యంగా విచారణ చేసి సంపాధించిన సమాచారం ఆధారంగా ముగ్గురు కిరాకతకులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. మైనర్ అమ్మాయి మీద ఎందుకు యాసిడ్ దాడి చేశారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు విచారణలో ఉన్నందున అరెస్టు అయిన ముగ్గురి పేర్లు చెప్పడం కుదరదని ఢిల్లీ పోలీసు అధికారులు అంటున్నారు. అమ్మాయి మీద యాసిడ్ దాడి జరగడంతో ఢిల్లీ మహిళా కమీషన్ చైర్మన్ కూడా సీరియస్ అయిన విషయం తెలిసిందే.