Girls: అక్కాచెల్లితో యువకుడు క్లోజ్, పర్సనల్ వీడియోలతో బ్లాక్ మెయిల్, టార్చర్ తట్టుకోలేక ఇద్దరూ ఏం చేశారంటే !
భోపాల్/ మధ్యప్రదేశ్: అక్కా, చెల్లెలు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఇద్దరూ మైనర్లు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు అక్కాచెల్లికి ముందు నుంచి పరిచయం ఉన్నాడు. అక్కతో చనువుగా ఉంటున్న యువకుడు ఆమె చెల్లెలితో క్లోజ్ గా ఉండటం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో అక్కాచెల్లిని ఆ నీఛుడు బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. మీ నగ్న వీడియోలు, ఫోటోలు నా దగ్గర ఉన్నాయని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. మీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకూడదు అంటే నేను చెప్పినట్లు వినాలి అని అతను బ్లాక్ మెయిల్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని అక్క మీద ఒత్తిడి చేశాడు. కొంతకాలం పాటు యువకుడి టార్చర్ తట్టుకున్న అక్కాచెల్లి చివరికి అతని ఆగడాలు తట్టుకోలేకపోయారు. దేవాలయానికి వెలుతున్నామని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అక్కాచెల్లెలు అదే రోజు బావిలో శవమై కనిపించడం కలకలం రేపింది.

ఒకే ప్రాంతంలో నివాసం
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలోని నాయ్ గర్హీ ప్రాంతంలో నివాసం ఉంటున్న అక్కా, చెల్లెలు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. అక్కకు 16 ఏళ్లు, చెల్లెలికి 12 ఏళ్ల వయసు ఉంది. అమ్మాయిలు ఇద్దరూ మైనర్లు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రవి చతుర్వేది అలియాస్ చతుర్వేది (24) అనే యువకుడు అక్కాచెల్లికి ముందు నుంచి పరిచయం ఉన్నాడు.

క్లోజ్ గా ఉన్నట్లు నటించాడు
ఒకే ప్రాంతంలో చతుర్వేది, అమ్మాయిలు ఇద్దరూ నివాసం ఉండటంతో ప్రతిరోజు కలుస్తున్నారు. అప్పుడప్పుడు ఊరిబయట ఉన్న తోటల్లోకి పొలాల్లోకి వెళ్లి వస్తున్నారు. అక్కతో చనువుగా ఉంటున్న చతుర్వేది ఆమె చెల్లెలితో క్లోజ్ గా ఉండటం మొదలుపెట్టాడు. చూసినవాళ్లు చుతుర్వేదికి, అక్కాచెల్లికి వయసులో చాలా తేడా ఉండటంతో పెద్దగా పట్టించుకోలేదు.

బ్లాక్ మెయిల్ చేసిన కిరాతకుడు
అక్కాచెల్లితో ఇంతకాలం క్లోజ్ గా ఉన్న చతుర్వేది తరువాత ఇద్దరిని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. మీ నగ్న వీడియోలు, ఫోటోలు నా దగ్గర ఉన్నాయని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని చతుర్వేది వారిని బెదిరించాడు. మీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకూడదు అంటే నేను చెప్పినట్లు వినాలి అని చతుర్వేది బ్లాక్ మెయిల్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని అక్క మీద చతుర్వేది కొంతకాలంగా ఒత్తిడి చేశాడు.

టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న అక్కాచెల్లెలు
కొంతకాలం పాటు చతుర్వేది టార్చర్ తట్టుకున్న అక్కాచెల్లి చివరికి అతని ఆగడాలు తట్టుకోలేకపోయారు. మే 23వ తేదీన దేవాలయానికి వెలుతున్నామని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అక్కాచెల్లెలు తరువాత బావిలో శవమై కనిపించడం కలకలం రేపింది. చతుర్వేది బ్లాక్ మెయిల్ చెయ్యడం వలనే అక్కాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారని విచారణలో వెలుగు చూసిందని, ఇద్దరి ఆత్మహత్యలకు కారణం అయిన నిందితుడిని అరెస్టు చేశామని పోలీసు అధికారి మిథిలేష్ యాదవ్ స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications