Goa: ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అవుతారు, ఒక్కో ఎమ్మెల్యేలకు బీజేపీ రూ. 50 కోట్లు ఇస్తోంది, సిద్దూ !
బెంగళూరు/గోవా: ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తారని, ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతోందని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. అయితే ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు ఇచ్చి బీజేపీ నాయకులు కొనుక్కుంటున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ. 50 కోట్ల ఇచ్చి కొనుక్కుంటున్న బీజేపీ నాయకులు ఆపరేషన్ కమల పేరుతో ఇతర పార్టీల ప్రభుత్వాలను కుప్పకూల్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారని, ఇది దేశానికి పట్టిన పీడ అని మాజీ సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకుల మీదమండిపడ్డారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇచ్చి బీజేపీలో చేర్చుకుంటున్నారని సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ కమల అలావాటు అయిపోయింది
కర్ణాటకలో బీఎస్ యడియూర్ప ఆపరేషన్ కమల పేరుతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల పేరుతో స్వతంత్ర పార్టీ అభ్యర్థులకు గాలం వేసి బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు దేశం మొత్తం ఆపరేషన్ కమల వ్యాపించిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య ఆరోపించారు.

ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే బీజేపీ నాయకులు కోట్లు ఇస్తున్నారు
ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తారని, ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతోందని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. అయితే ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు ఇచ్చి బీజేపీ నాయకులు కొనుక్కుంటున్నారని, వారి స్వార్థం కోసం ప్రజల ఓటు హక్కును కాలరాస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.

ఒక్కో ఎమ్మెల్యేకి రూ. 50 కోట్లు
గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకి రూ. 50 కోట్ల ఇచ్చి కొనుక్కుంటున్న బీజేపీ నాయకులు ఆపరేషన్ కమల పేరుతో ఇతర పార్టీల ప్రభుత్వాలను కుప్పకూల్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోందని, ఇది దేశానికి పట్టిన పీడ అని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకుల మీదమండిపడ్డారు.

గోవాలో ఇదే జరిగింది
గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇచ్చి బీజేపీలో చేర్చుకుంటున్నారని సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైకెల్ లోబోకు ఇదే ఆశ చూపించిన బీజేపీ నాయకులు ఆయన్ను వలలో వేసుకున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక మాజీ మంత్రి, గోవా కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ దినేష్ గుండూరావ్ ఆరోపించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications