అమానుషం.. 13 ఏళ్ల బాలికపై 15 రోజుల పాటు మృగాళ్ల వేట!
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్లో సభ్యసమాజం తలదించుకునే అత్యంత అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికపై 15 రోజుల పాటు జరిగిన పైశాచికం పోలీసులనే వణికించింది. ప్రేమ పేరుతో వంచన, ఆపై కామాంధుల చేతిలో చిత్రహింసలు.. వెరసి ఓ పసి ప్రాణం నరకాన్ని చవిచూసింది. గోరఖ్పూర్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ బాలుడు (15) బాలికను నమ్మించి హోటల్కు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
అసలేం జరిగిందంటే?
గోరఖ్నాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 13 ఏళ్ల బాలికకు ఆరు నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. జనవరి 1న ఆ అబ్బాయి మాటలు నమ్మి బాలిక తన ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నిందితుడు ఆమెను 'భూమి ప్యాలెస్' అనే హోటల్కు తీసుకెళ్లి మూడు రోజుల పాటు బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు.

మృగాలుగా మారిన హోటల్ యజమాని, మేనేజర్
దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికను కాపాడాల్సింది పోయి హోటల్ యజమాని ధీరేంద్ర సింగ్, మేనేజర్ ఆదర్శ్ పాండేలు ఆమెపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. బాలిక స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నా, మత్తు మందులు ఇచ్చి మరీ తమ పాశవిక ఆకలిని తీర్చుకున్నారు. మానవత్వం మంటగలిపేలా హోటల్ యజమానులు ఆ బాలికను బడహల్గంజ్లోని 'గ్రీన్ డైమండ్ స్పా సెంటర్' యజమాని అంకిత్కు విక్రయించారు. అక్కడ కూడా ఆ బాలికకు నరకం కనిపించింది. పని ఇప్పిస్తామనే పేరుతో స్పా మేనేజర్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరకు బాలిక పరిస్థితి విషమించడంతో ఆమెను తిరిగి నౌసడ్ ప్రాంతంలోని మరో హోటల్లో దాచిపెట్టారు.
పోలీసుల దర్యాప్తు.. నిందితుల అరెస్ట్
జనవరి 5న బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇన్స్టాగ్రామ్ ఐడీ, తల్లి ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 15 రోజుల గాలింపు తర్వాత జనవరి 20న బాలికను హోటల్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. హోటల్ యజమాని అభయ్ సింగ్, మేనేజర్ ఆదర్శ్ పాండే, స్పా మేనేజర్ అంకిత్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడైన ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాలిక వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం నిందితులపై పోక్సో చట్టంతో పాటు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అభినవ్ త్యాగి వెల్లడించారు.
స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో చీకటి వ్యాపారం
హైవేల పక్కన నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హోటళ్లు, స్పా సెంటర్లే లక్ష్యంగా పోలీసులు ఇప్పుడు తనిఖీలు ముమ్మరం చేశారు. మైనర్ బాలికలను ట్రాప్ చేసి వ్యభిచార రొంపిలోకి దించుతున్న ముఠాల ఆటకట్టించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సోషల్ మీడియాలో వచ్చే తెలియని వ్యక్తుల పరిచయాలు ప్రాణాల మీదకు వస్తాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్ వినియోగంపై అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.
-
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications