కేంద్రం సంచలనం: బుజ్జగింపులకు స్వస్తి, హజ్ సబ్సిడీ రద్దు
న్యూఢిల్లీ: హజ్ యాత్రికులకు ఈ ఏడాది నుంచి సబ్సిడీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుజ్జగింపులకు తావు లేకుండా మైనారిటీలకు సాధికారిత కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
హజ్ సబ్సిడీని రద్దు చేస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. మైనారిటీలను బుజ్జగించే ధోరణిలో కాకుండా గౌరవమర్యాదలతో సాధికారులను చేసే లక్ష్యంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

హజ్ సబ్సిడీ కోసం ఉద్దేశించిన నిధులను మైనారిటీల్లో విద్యా వికాసానికి, ఆ సమాజంలోని బాలికల సంక్షేమానికి ఖర్చు చేస్తామని అన్నారు ఈ ఏడాది రికార్డు సంఖ్యలో 1.75 లక్షల మంది హజ్ యాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు.
హజ్ సబ్సిడీని క్రమంగా 2022 నాటికి పూర్తిగా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకేంద్ర ప్రభుత్వాన్ని 2012లో ఆదేశించింది.












Click it and Unblock the Notifications