రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు..ఎంపీలు గాంధీతత్వాన్ని పాటించాలన్న కోవింద్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు రాజ్యసభ, లోక్సభ ఎంపీలు సంయుక్తంగా వీడ్కోలు ఇచ్చారు. పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు.

పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం.. వీడ్కోలు సందర్భంగా రామ్నాథ్ కోవింద్
ఈరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన రాష్ట్రపతి వీడ్కోలు వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు లోక్సభ స్పీకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు లేఖ, జ్ఞాపికను అందజేశారు. వీడ్కోలు సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. రాష్ట్రపతిగా పనిచేయడానికి తనకు అవకాశం కల్పించినందుకు దేశ పౌరులకు కృతజ్ఞతలు తెలుపుతూ, పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ "ప్రజాస్వామ్య దేవాలయం" అని పేర్కొన్నారు.

పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న కోవింద్
ఈరోజు తాను అందరికీ వీడ్కోలు పలుకుతున్న వేళ తన గుండెల్లో ఎన్నో పాత జ్ఞాపకాలు మెదులుతున్నాయన్నారు. సెంట్రల్ హాల్ అని పిలువబడే ఈ భవన సముదాయంలో, ఐదు సంవత్సరాలుగా సంవత్సరాలుగా చాలా మంది ఎంపీలతో చిరస్మరణీయ క్షణాలు గడిపానని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం ఇదే హాల్ లో ప్రమాణం చేశాను. ఐదేళ్లపాటు తాను తీసుకున్న అనేక కీలక నిర్ణయాలను అందరి సహకారం ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. ఇదే సమయంలో తన హృదయంలో ఎంపీలందరికీ ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.
ఎంపీలు గాంధీ తత్వాన్ని పాటించండి
హాజరైన ఎంపీలు, మంత్రులందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మీరు భారతదేశ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధి కావడం మీ అందరికీ గర్వకారణమని రామ్నాథ్ కోవింద్ వెల్లడించారు. నా మాజీ అధ్యక్షులందరూ నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీలు, పార్టీ రాజకీయాలకు అతీతంగా పని చేయాలని రామ్నాథ్ కోవింద్ అన్నారు. పార్లమెంటులో చర్చ మరియు అసమ్మతి హక్కులను వినియోగించుకునే సమయంలో ఎంపీలు ఎల్లప్పుడూ గాంధీ తత్వాన్ని అనుసరించాలి అని ఆయన పేర్కొన్నారు.

కోవిడ్ సమయంలో భారత్ కృషి ప్రశంసనీయం .. ద్రౌపది ముర్ముకు కోవింద్ అభినందనలు
కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఇబ్బందులు పడుతోంది. మహమ్మారి నుండి మనం పాఠాలు నేర్చుకుంటామని నేను ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. మనమందరం ప్రకృతిలో భాగమని మరచిపోయాము కాబట్టే ఇలాంటి మహమ్మారులు వస్తున్నాయన్నారు. కష్ట సమయాల్లో, భారతదేశం యొక్క ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడ్డాయి అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన వీడ్కోలు ప్రసంగంలో గుర్తు చేశారు.
తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు ద్రౌపది ముర్ముని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆమె మార్గదర్శకత్వం నుండి భారతదేశం ప్రయోజనం పొందుతుంది అని రామ్నాథ్ కోవింద్ తెలిపారు.

పీఎం మోడీకి,ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలకు కోవింద్ కృతజ్ఞతలు
అంబేద్కర్ కలలు కన్న భారతదేశాన్ని నిర్మిస్తున్న తరుణమని ఆయన పేర్కొన్నారు. తనకు ఇంత కాలం సహకరించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రిమండలి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలకు కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ద్రౌపదీ ముర్ముతో తొలి తెలుగు సీజేఐ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications