Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Opinion poll: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆశలు వదిలేసుకోవాల్సిందే..!!

భోపాల్: ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ సహా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంటోంది. భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి వ్యూహ, ప్రతివ్యూహాలను పన్నుతోన్నాయి.

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీనే మొదట ప్రభుత్వాన్ని నెలకొల్పినప్పటికీ.. ఆ తరువాత జరిగిన ఆపరేషన్ లోటస్ నేపథ్యంలో అధికారాన్ని బీజేపీకి కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది మధ్యప్రదేశ్.

Ground Zero opinion poll on Madhya Pradesh 2023: Who is winning, BJP or Cong?

ఈ పరిస్థితుల మధ్య గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ తన ఒపీనియన్ పోల్‌ను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై సర్వే, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థ ఇది. తాజాగా మధ్యప్రదేశ్‌పై సర్వే చేపట్టింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఇది. జూన్ 5వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది.

మొత్తంగా 40,000 మంది అభిప్రాయాలను సేకరించింది. అన్ని సామాజిక వర్గాలను సంప్రదించింది. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, శాంతి భధ్రతలు, నిరుద్యోగం, పరిశ్రమలు- పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ప్రాజెక్టులు.. ఇలా- అన్ని అంశాల ఆధారంగా వారి నుంచి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకుంది.

ఈ సర్వే ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 127 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అలాగే- 42.67 శాతం ఓట్లతో కాంగ్రెస్ అధికారాన్ని అందుకుంటుందని గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. బీజేపీ వ్యతిరేక పవనాలను ఎదుర్కొంటోందని, ఓటమి తప్పకపోవచ్చని పేర్కొంది.

బీజేపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని గ్రౌండ్ జీరో సర్వే అంచనా వేసింది. 98 స్థానాలు మాత్రమే లభిస్తాయని స్పష్టం చేసింది గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ. ఈ పార్టీకి లభించే ఓట్ల శాతం 39.51 శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి ఉన్న సీట్లు 130. ఈ ఫిగర్‌ను బీజేపీ ఏమాత్రం అందుకోలేదని, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని తేల్చి చెప్పింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+