లక్ష లంచం డిమాండ్.. పట్టుబడ్డ జీఎస్టీ అధికారి
ముంబై : పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ.. కొందరు అధికారుల తీరుతో అభాసుపాలవుతోంది. జీఎస్టీని పర్యవేక్షించాల్సిన అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. మామూళ్ల మత్తులో జోగుతూ జీఎస్టీ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. అదే క్రమంలో మహారాష్ట్రలోని పుణేలో ఓ అధికారి పట్టుబడటం చర్చానీయాంశమైంది.
జీఎస్టీ పన్నుల శాఖకు చెందిన క్లాస్ - 2 విభాగం అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రెడ్హ్యాండెడ్గా పట్టుబడటం చర్చానీయాంశమైంది. పన్ను చెల్లింపు విషయంలో పూణేలోని ఓ వ్యక్తికి జీఎస్టీ పన్నుల శాఖ నోటీసులు జారీచేసింది. అయితే ఆ నోటీసులను వెనక్కి తీసుకోవాలని సదరు వ్యక్తి జీఎస్టీ అధికారిని కోరాడు.

అయితే సదరు జీఎస్టీ అధికారి నోటీసులు ఉపసంహరించుకునేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. నోటీసులు అందుకున్న సదరు వ్యక్తి నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications