డిసెంబర్ 8వ తేదీన గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు వెలువడతాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గుజరాత్కు రెండు దశల్లో అంటే డిసెంబర్ 1న డిసెంబర్ 5వ తేదీన ఎన్నికలు జరిగాయి. మొత్తం 33 జిల్లాల్లోని 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 92 స్థానాలు. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం గుజరాత్లో బీజేపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. మొత్తానికి ఆప్ ఎంట్రీతో గుజరాత్లో త్రిముఖ పోటీ నెలకొందనే చెప్పాలి. గుజరాత్లో 66.31శాతం పోలింగ్ నమోదైంది.
ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. గుజరాత్ కంటే ముందే ఒకే విడతలో ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్లో అధికారం పొందాలంటే మ్యాజిక్ ఫిగర్ 35.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి హోరాహోరీ పోరు జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ జరిగింది. ఆప్ కూడా గట్టి పోటీ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఇక రెండు ప్రధాన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నిక ఫలితాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం..
హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో 40 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, బీజేపీ 25 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లు విజయం సాధించారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
हिमाचल प्रदेश की जनता को इस निर्णायक जीत के लिए दिल से धन्यवाद।
— Rahul Gandhi (@RahulGandhi) December 8, 2022
सभी कांग्रेस कार्यकर्ताओं और नेताओं को हार्दिक बधाई। आपका परिश्रम और समर्पण इस विजय की शुभकामनाओं का असली हकदार है।
फिर से आश्वस्त करता हूं, जनता को किया हर वादा जल्द से जल्द निभाएंगे।
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ.
గుజరాత్ గెలుపు.. దేశం అమృత కాలంలోకి ప్రవేశిస్తుంనడానికి నాంది అని మోడీ వ్యాఖ్యానించారు.
కొత్త ఆకాంక్షలకు ప్రతిరూపమే ఈ తీర్పు అని అన్నారు. ఈ విజయాలు పెద్ద కఠిన నిర్ణయాలకు నాంది పలుకుతాయన్నారు మోడీ.
గుజరాత్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ కార్యకర్తల శ్రమకు తగిన ఫలితం లభించిందన్నారు మోడీ. గుజరాత్ ప్రజలు అన్ని రికార్డులూ బ్రేక్ చేశారని అభినందించారు.
Speaking at the @BJP4India HQ in Delhi. https://t.co/1617VCfIdx
— Narendra Modi (@narendramodi) December 8, 2022
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి మోడీ పాల్గొన్నారు.
ప్రజల ఆశీర్వాదంతోనే గత రికార్డులు తిరగరాస్తూ బీజేపీ విజయం సాధించిందన్నారు మోడీ.
ప్రజల ఆశీర్వాదం ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ఈ ఫలితాలే నిదర్శనమిన అన్నారు మోడీ.
గుజరాత్ ఫలితాలు భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారని మరోసారి నిరూపించాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
The results of Gujarat have proved how strong is the desire of the common man for a developed India. The message is clear that whenever there is a challenge before the country, people show their faith in BJP: Prime Minister Narendra Modi pic.twitter.com/N74iawfnt3
— ANI (@ANI) December 8, 2022
దేశానికి ఏ సవాల్ ఎదురైనా ప్రజల నమ్మం బీజేపీపైనే ఉంది: ప్రధాని మోడీ
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క శాతం కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయామని ప్రధాని మోదీ అన్నారు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు.
గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని మరోసారి నిరూపించారని ప్రధాని మోదీ అన్నారు. స్థానికుల ఆశీర్వాదం వల్లే మరోసారి గెలిచామని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తోందని పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక శాతం కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయిందని సీఎం జైరాం ఠాకూర్ పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాంగ్రెస్ అతి తక్కువ ఓట్లతో విజయం సాధించిందన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు.
సుపరిపాలన, సత్వర అభివృద్ధి వల్లే గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీని రికార్డ్ స్థాయిలో గెలపించారని పేర్కొన్న త్రిపుర సీఎం మాణిక్ సాహో.
హిమాచల్ప్రదేశ్ బీజేపీ పరాజయంపై ప్రధాని మోదీ స్పందించారు. పార్టీ పట్ల ప్రజలు చూపిన అభిమానానికి, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు రాబోయే కాలంలో ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు కృషి చేస్తామని చెప్పారు.
— Samajwadi Party (@samajwadiparty) December 8, 2022
ఉత్తరప్రదేశ్లో జరిగిన మైన్పురి ఉపఎన్నికల్లో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. తన సమీప బీజేపీ అభ్యర్థి రఘురాజ్ షాక్వాపై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది.
To all hardworking @BJP4Gujarat Karyakartas I want to say - each of you is a champion! This historic win would never be possible without the exceptional hardwork of our Karyakartas, who are the real strength of our Party.
— Narendra Modi (@narendramodi) December 8, 2022
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని కార్యకర్తల గెలుపుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. అసాధారణమైన వారి కృషి లేకుండా ఈ చారిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదని పేర్కొన్నారు.
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 స్థానాలకు గాను హస్తం 40 చోట్ల గెలుపొందింది. బీజేపీ 25 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతరులు 3 చోట్ల విజయం సాధించారు.
Live: ભાજપાના ઐતિહાસિક વિજયની ઉજવણીરૂપે ઘાટલોડિયા ખાતે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની જાહેરસભા #भाजपा_की_प्रचंड_जीत https://t.co/5LbILklLBk
— BJP Gujarat (@BJP4Gujarat) December 8, 2022
గుజరాత్లో అధికార పిఠాన్ని మరోసారి బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం 182 స్థానాలకు గాను 156 స్థానాల్లో కమలం విజయకేతనం ఎగురవేసింది. ఘోర పరాజయంతో కాంగ్రెస్ 17 సీట్లకు పరిమితమైంది. ఆప్ 5, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు.
हिमाचल प्रदेश की जनता को इस निर्णायक जीत के लिए दिल से धन्यवाद।
— Rahul Gandhi (@RahulGandhi) December 8, 2022
सभी कांग्रेस कार्यकर्ताओं और नेताओं को हार्दिक बधाई। आपका परिश्रम और समर्पण इस विजय की शुभकामनाओं का असली हकदार है।
फिर से आश्वस्त करता हूं, जनता को किया हर वादा जल्द से जल्द निभाएंगे।
హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపిన ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ.
राष्ट्रीय पार्टी बनने पर आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं और सभी देशवासियों को बधाई। pic.twitter.com/sba9Q1sz1f
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 8, 2022
గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆప్ జాతీయ పార్టీగా అవతరించిందని ఆపార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజివాల్ అన్నారు.10 సంత్సరాల క్రితం ఒక చిన్న పార్టీ.. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. జాతీయ పార్టీగా మారిందని చెప్పారు.