చలించాను: వాళ్ల పిల్లలను చదివిస్తానని ముందుకొచ్చిన గుజరాత్ వ్యాపారి
గాంధీ నగర్: జమ్మూ కాశ్మీర్లోని యూరీ సెక్టార్ లో సైనిక శిబిరంపై పాక్ ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీపై ఈ మధ్య కాలంలో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇదే.
ఈ ఉగ్రదాడిలో అమరవీరుల పిల్లలను తాను చదివిస్తానంటూ ముందుకొచ్చారు గుజరాత్కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్. సూరత్కు చెందిన 47 ఏళ్ల మహేశ్ సవానీ యూరీ ఉగ్రదాడిలో వీరమరణం పొంది 18 మంది సైనికుల పిల్లలకు ఉచితంగా చదవు చెప్పిస్తానని ముందుకొచ్చాడు.

తాను ఈ నిర్ణయం తీసుకోడానికి గల కారణాన్ని కూడా ఆయన వివరించాడు. ఉగ్రదాడిలో చనిపోయిన ఓ జవాను కుమార్తె తండ్రి చనిపోయిన బాధతో కన్నీరుమున్నీరవుతూ నాన్న తనని బాగా చదువుకోవాలని జీవితంలో పైకి ఎదగాలని చెప్పాడని ఆ చిన్నారి చెప్తుంటే మనసు చలించిందని అన్నారు.
అందుకే ఆ పిల్లలందరికీ తననడుపుతున్న పీపీ సవానీ ఇంటర్నేషనల్ స్కూలులో ఉచితంగా చదువు చెప్పించాలని నిర్ణయించుకున్నానని మహేశ్ తెలిపారు. కాగా, సవానీ ఇంటర్నేషనల్ స్కూలులో చదువుతో పాటు పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పిస్తామని తెలిపారు.
అయితే సవానీ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తల్లిదండ్రులు లేని 472 మంది ఆడ పిల్లలకు అన్నీ తానై వివాహాలు జరిపించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications