ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ అడిగినందుకు రూ.25,000 ఫైన్ వేసిన హైకోర్టు
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హత విషయంలో గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఉన్నత విద్యను అభ్యసించారనడానికి ఎలాంటి ఆధారాలను కూడా ఎవరికీ చూపాల్సిన అవసరం లేదని తెలిపింది. మోదీ విద్యార్హత పత్రాలను బయట పెట్టాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం, గుజరాత్ యూనివర్శిటీ, సమాచార హక్కు ప్రధాన కమిషనర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాని మోదీ విద్యార్హత విషయంలో కొంతకాలంగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. దీనిపై సవాల్ విసిరారు. తన విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను బయటపెడతానని, అదే పని మోదీ చేయగలరా? అంటూ ఛాలెంజ్ చేశారు. అదే సమయంలో గుజరాత్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు కూడా చేశారు. దీనిపై సమాచార హక్కు ప్రధాన కమిషనర్ కార్యాలయం- గుజరాత్ యూనివర్శిటీకి లేఖ రాసింది.

1978లో గుజరాత్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినట్లు లోక్సభ ఎన్నికల సమయంలో తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో పొందుపరిచారు ప్రధాని మోదీ. 1983లో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లూ పేర్కొన్నారు. దీని ఆధారంగా 2016లో అరవింద్ కేజ్రీవాల్- కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ శ్రీధర్ ఆచార్యులుకు లేఖ రాశారు. మోదీ విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలంటూ విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి స్థాయి నాయకుడికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను అందజేయాలా? వద్దా? అనే విషయంపై గుజరాత్ యూనివర్శిటీ.. హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ మేరకు పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను గుజరాత్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అరవింద్ కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ పెర్సీ కవినా వాదనలను వినిపించారు. ఇవ్వాళ వాదనలు పూర్తయ్యాయి.
న్యాయమూర్తి జస్టిస్ బీరెన్ వైష్ణవ్తో కూడిన ధర్మాసనం ఇవ్వాళ కీలక ఆదేశాలను జారీ చేసింది. మోదీ విద్యార్హత వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆయనకు చెందిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను బయటపెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మోదీ విద్యార్హత వివరాలను కోరిన అరవింద్ కేజ్రీవాల్కు భారీ జరిమానా విధించింది. ఏకంగా 25,000 రూపాయల మేర జరిమానా కట్టాలని ఆదేశించింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications