Gyanvapi: హిందూ మందిరాన్ని కూల్చి మసీదు నిర్మించారు: సర్వే రిపోర్టులో సంచలనాలు
వారణాసి: ఉత్తర్ప్రదేశ్ కాశీలోని జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్ఞానవాపి మసీదు కింద అతి పెద్ద హిందూ ఆలయం ఆనవాళ్లను గుర్తించినట్లు ఏఎస్ఐ సర్వేలో వెల్లడైందని హిందూపక్షం న్యాయవాది విష్ణుశంకర్జైన్ తెలిపారు.
నిర్మాణం కింద 34 శాసనాలను ఏఎస్ఐ సర్వేలో గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా 32 ముద్రికలను కూడా ఏఎస్ఐ సర్వేలో భాగంగా కనుగొన్నట్లు న్యాయవాది విష్ణుశంకర్ వివరించారు. నిర్మాణ సమయంలోనూ శాసనాలు వాడినట్లు సర్వేలో వెల్లడైందని ఆయన పేర్కొన్నారు.

తెలుగు సహా దేవనాగరి, గ్రంథ, కన్నడ భాషల్లో శాసనాలున్నట్లు న్యాయవాది విష్ణుశంకర్ వివరించారు. గతంలో ధ్వంసమైన నిర్మాణ భాగాలు మళ్లీ వాడినట్లు సర్వేలో బయటపడిందని ఆయన అన్నారు. శాసనాలపై జనార్దన, రుద్ర, ఉమేశ్వర దేవతల పేర్లనూ ఏఎస్ఐ నిర్వహించిన సర్వేలో గుర్తించినట్లు విష్ణుశంకర్ తెలిపారు.
#WATCH | Varanasi, Uttar Pradesh | Advocate Vishnu Shankar Jain, representing the Hindu side, gives details on the Gyanvapi case.
— ANI (@ANI) January 25, 2024
He says, "The ASI has said that there existed a large Hindu Temple prior to the construction of the existing structure. This is the conclusive… pic.twitter.com/rwAV0Vi4wj
మసీదునునిర్మించేందుకు ఆలయాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. ఏఎస్ఐ రిపోర్టు ప్రకారం.. గ్రౌండ్ పెనేట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) సర్వే చేశారని, సైట్లో చారిత్రక పొరలను కలిగి ఉన్నట్లు తెలుస్తోందని.. ప్రస్తుత నిర్మాణం ముందుగా ఉన్న నిర్మాణంపై నిర్మించబడిందనే విషయాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.
#WATCH | Varanasi: Sita Sahu, Petitioner, Hindu side speaks on Archaeological Survey of India's report on Gyanvapi Case
— ANI (@ANI) January 25, 2024
She says, "Today we have brought forth some proof that there was a temple... We will request a survey of the other parts too..." pic.twitter.com/pT88Es1TkO
17వ శతాబ్దంలో హిందూ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించనిట్లు వివిరంచారు. కాగా, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే రిపోర్టును ఇరు పక్షాలకు ఇవ్వాలని బుధవారం వారణాసి జిల్లా కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసందే. ఈ రిపోర్టును బహిరంగపర్చాలని కోర్టు తెలిపింది. కాగా, హిందూ ఆలయం ఉందని తేలడంతో హిందూ వర్గం పిటీషనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి సర్వే జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
-
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..!












Click it and Unblock the Notifications