బిజెపి ఢిల్లీ సిఎం అభ్యర్థి హర్ష: అప్సెట్ కాలేదని గోయల్
న్యూఢిల్లీ: తమ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా హర్షవర్ధన్ను భారతీయ జనతా పార్టీ బుధవారం ప్రకటించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ హర్షవర్ధన్ పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాజ్ మాట్లాడుతూ... ఢిల్లీ బిజెపిలో ఎలాంటి విభేదాలు లేవన్నారు.
బుధవారం ఉదయం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై చర్చించింది. గతంలో హర్షవర్ధన్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో రాజ్నాథ్ హర్షవర్ధన్ పైన ప్రశంసలు గుప్పించారు.

అద్వానీ మాట్లాడుతూ... న్యూఢిల్లీ ఎన్నికలలో బిజెపి కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు విజయ్ గోయల్ సమక్షంలోనే హర్షవర్ధన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. గోయల్ మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తాను అప్ సెట్ కాలేదన్నారు. తాను పార్టీకి విశ్వాసపాత్రుడినన్నారు.
కాగా, హర్షవర్ధన్ నాలుగుసార్లు శాసన సభ్యుడిగా గెలిచారు. క్లీన్ ఇమేజ్ ఉంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications