ప్రభుత్వానికి షాక్, కూటమిలో నో ప్రాబ్లమ్, ఆ కేసు వ్యవహారంలో డీసీఎం ప్లాన్ రివర్స్!
2023లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత జేడీఎస్ పార్టీ ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించింది. కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని జేడీఎస్ పోటీ చేసింది. హాసన్, మండ్య, కోలార్లో జేడీఎస్ అభ్యర్థులు పోటీ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో రెండవ దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ మే 7న జరిగింది. అయితే దీనికి ముందే హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వీడియోలు విడుదల కావడం కలకలం రేపింది.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది. హాసన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ కేసు విచారణ చెయ్యడానికి సిద్దరామయ్య ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయాడు. ప్రజ్వల్ రేవణ్ణ పాస్పోర్టును రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య, సిట్ అధికారులు వేర్వేరుగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు.

మే 31వ తేదీన తాను భారత్ వస్తానని ప్రజ్వల్ రేవణ్ణ సోమవారం ఓ వీడియో విడుదల చేశారు. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన వెంటనే పరిషత్ ఎన్నికలు మొదలైనాయి. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు కారణంగా ఎన్డీఏ నుంచి జేడీఎస్ బయటకు వచ్చేస్తుందని కాంగ్రెస్ ఊహించింది. ప్రజ్వల్ రేవణ్ణ కేసును అడ్డం పెట్టుకున్న కాంగ్రెస్ బీజేపీ, జేడీఎస్ నాయకులపై పదేపదే ఆరోపణలు చేస్తూ వారిని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది.
ఇదే సమయంలో బీజేపీ, జేడీఎస్ నేతలు కాంగ్రెస్, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆరోపణలు చెయ్యడంతో ప్రజ్వల్ రేవణ్ణ కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ-జేడీఎస్ కూటమి పరిషత్ ఎన్నికలను ఎదుర్కొంటోంది. ప్రజ్వల్ కేసు కూటమిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కర్ణాటకలోని మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు జూన్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా, జూన్ 6వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

బీజేపీ-జేడీఎస్ పొత్తు ప్రకారం బీజేపీ జేడీఎస్కు రెండు సీట్లు వదులుకుంది. ఈ ఎన్నికల ప్రచారాన్ని ఇరు పార్టీల నేతలు కలిసి నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఆదివారం బీజేపీ-జేడీఎస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి, ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రజ్వల్ రేవణ్ణ కేసు తర్వాత జేడీఎస్ నుంచి కాంగ్రెస్ కు మద్దతు లభిస్తుందని అంతా భావించారు. డీసీఎం డీకే శివకుమార్ ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఎదగాలని భావించారు. కానీ కూటమి బలంగా ఉంది, కూటమి నుంచి జేడీఎస్ బయటకు రాకపోవడంతో డీకే శివకుమార్కు ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక్కలిగ సామాజిక వర్గం జేడీఎస్ పార్టీ వెంట ఉందని మరోసారి రుజువు అయ్యిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద ప్రజ్వల్ రేవణ్ణ కేసు కారణంగా ఒక్కలిగుల ఓట్లు చీల్చాలని ప్రయత్నించిన డీకే శివకుమార్ కు ఎదురుదెబ్బ తగిలిందని బీజేపీ, జేడీఎస్ నాయకులు అంటున్నారు.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications