కోల్కతా మాజీ సీపీ రాజీవ్ ఇంటికి సీబీఐ అధికారులు.. శారదా చిట్ఫండ్ స్కాం కేసులో అరెస్ట్..?
కోల్కతా : శారదా చిట్ ఫండ్ స్కాంలో కోల్ కతా మాజీ పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అరెస్ట్ నుంచి ఇదివరకు మినహాయింపు ఇవ్వగా .. తాజాగా ఆ ఆర్జిని హైకోర్టు వెనక్కి తీసుకుంది. హైకోర్టులో రాజీవ్కుమార్కు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరించలేదు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాసేపటి క్రితం రాజీవ్ కుమార్ ఇంటికెళ్లారు.
బెంగాల్లో శారదా చిట్ ఫండ్ స్కాం జరిగింది. 2014లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. శారదా గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ పేరుతో రూ.2500 కోట్లను ఖాతాదారుల నుంచి వసూల్ చేశారు. ఆ నగదు తిరిగి ఇవ్వకపోవడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. అప్పటి పోలీసు ఉన్నతాధికారి రాజీవ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఆయనను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాపాడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో సీబీఐ అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అందుకు ఇదివరకు కోల్ కతా హైకోర్టు అంగీకరించగా .. తాజాగా విరమించుకుంది. దీంతో సీబీఐ అధికారులు రాజీవ్ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications