కోల్కతా మాజీ సీపీ రాజీవ్ ఇంటికి సీబీఐ అధికారులు.. శారదా చిట్ఫండ్ స్కాం కేసులో అరెస్ట్..?
కోల్కతా : శారదా చిట్ ఫండ్ స్కాంలో కోల్ కతా మాజీ పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అరెస్ట్ నుంచి ఇదివరకు మినహాయింపు ఇవ్వగా .. తాజాగా ఆ ఆర్జిని హైకోర్టు వెనక్కి తీసుకుంది. హైకోర్టులో రాజీవ్కుమార్కు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరించలేదు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాసేపటి క్రితం రాజీవ్ కుమార్ ఇంటికెళ్లారు.
బెంగాల్లో శారదా చిట్ ఫండ్ స్కాం జరిగింది. 2014లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. శారదా గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ పేరుతో రూ.2500 కోట్లను ఖాతాదారుల నుంచి వసూల్ చేశారు. ఆ నగదు తిరిగి ఇవ్వకపోవడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. అప్పటి పోలీసు ఉన్నతాధికారి రాజీవ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఆయనను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాపాడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో సీబీఐ అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అందుకు ఇదివరకు కోల్ కతా హైకోర్టు అంగీకరించగా .. తాజాగా విరమించుకుంది. దీంతో సీబీఐ అధికారులు రాజీవ్ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications