ఆరుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపులు: హెచ్ఎం అరెస్ట్
శివగంగ: ఆరుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని పెరియణరికొట్టాయిలో చోటు చేసుకుంది.
విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పంచాయత్ యూనియన్ ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురుగన్ను అదుపులోకి తీసుకున్నారు.

16 మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు మరో టీచర్ ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిపై చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పూసాయిదురాయి, అడిషనల్ సూపరింటెండెంట్ వందిత పాండే విచారణ జరిపారు.
పూసాయిదురాయి మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులు తమ విద్యను అదే పాఠశాలలో కొనసాగించవచ్చని.. నిందిత ప్రధానోపాధ్యాయుడ్ని తొలగించి మరో టీచర్ను నియమిస్తామని హామీ ఇచ్చారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications