8వ తరగతి పాస్ అయ్యారా..? అయితే నెలకు రూ.72,000 జీతం మీదే..!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకు శుభవార్త. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో, తాజాగా తమిళనాడు రాష్ట్రం పరిధిలోని హైవేస్ (రహదారుల) డిపార్ట్మెంట్లో పలు కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 8వ తరగతి చదివిన వారికి కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
తమిళనాడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్, ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ గార్డ్ వంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి. కోయంబత్తూరు, తంజావూరు, వెల్లూరు, కడలూరు, తిరుచ్చి, నాగర్కోయిల్ వంటి ప్రధాన జిల్లాలతో సహా మొత్తం 10 జిల్లాల్లో కలిపి 80 ఖాళీలు భర్తీ కానున్నాయి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం లభించనుంది. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ గార్డులకు నెలవారీ జీతం రూ.700 నుంచి రూ.8,100 వరకు ఉంటుంది. ఇక డ్రైవర్ పోస్టుకు జీతం రూ.19,500 నుంచి రూ.71,900 వరకు లభించనుంది.
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హత 8వ తరగతి చదివి ఉండాలి. డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అలాగే హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుకు రెండేళ్ల అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 01.07.2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు.అభ్యర్థుల ఎంపిక కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు.
ముఖ్య గమనిక:
ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక (Contract Basis) ప్రాతిపదికన జరుగుతాయి. ఇవి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కావు. ఈ పోస్టుల నియామకాన్ని ఎప్పుడైనా రద్దు చేసే అధికారం సూపరింటెండింగ్ ఇంజనీర్కు ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత జిల్లా వెబ్సైట్ల నుండి డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి పోస్ట్ ద్వారా సరైన చిరునామాకు పంపాలి. దరఖాస్తులు సమర్పించడానికి నవంబర్ 20 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications