Hijab Row: కాలేజ్ లోకి హిజాబ్ లతో అమ్మాయిలు ఎంట్రీ, గేట్ బయటకు పంపించేశారు, ధర్నా !
బెంగళూరు/ విజయపుర: హిజాబ్ వివాదం కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్బంలోనే మరోసారి ముస్లీం అమ్మాయిలు హిజాబ్ దరించి కాలేజ్ కు వెళ్లి నిరసనలు వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. హిజాబ్ లు, కాషాయం కండువాలు దరించకూడదని, నుదిటి మీద తిలకం పెట్టుకోకూడదని, మతపరమైన దస్తులు దరించి విద్యాసంస్థల్లో అడుగుపెట్టకూడదని కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసినా కొందరు ముస్లీం అమ్మాయిలు కోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. కాలేజ్ లు ప్రారంభం అయిన రోజు ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ లు వేసుకుని కొందరు ముస్లీం అమ్మాయిలు బలవంతంగా కాలేజ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే కాలేజ్ ప్రిన్సిపాల్ తో పాటు అక్కడ ఉన్న మహిళా పోలీసులు హిజాబ్ లు వేసుకుని కాలేజ్ లోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన అమ్మాయిలను అడ్డుకున్నారు. హైకోర్టు మద్యంతర ఆదేశాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని, హిజాబ్ లు వేసుకుని లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని కాలేజ్ ప్రిన్సిపాల్ తేల్చి చెప్పారు. కాలేజ్ లోని ఒక గదిలో బుర్కాలు, హిజాబ్ లు భద్రపరచడానికి ఏర్పాట్లు చేశామని, అక్కడ మతపరమైన దుస్తులు తీసివేసి క్లాసులకు హాజరుకావాలని కాలేజ్ ప్రిన్సిపాల్ ముస్లీం అమ్మాయిలకు మనవి చేశారు. ఇదే సమయంలో కాలేజ్ ప్రిన్సిపాల్ తో కొందరు అమ్మాయిలు వాదనలకు దిగడంతో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తతంగం వీడియోలు తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

విద్యాసంస్థల్లో హిజాబ్ గొడవ
కర్ణాటకలో హిజాబ్ లు వేసుకుని స్కూల్స్, కాలేజ్ లకు వెళ్లడం వివాదానికి దారితీసింది. హిజాబ్ లు, కాషాయం కండువాలు దరించకూడదని, నుదిటి మీద తిలకం పెట్టుకోకూడదని, మతపరమైన దస్తులు దరించి విద్యాసంస్థల్లో అడుగుపెట్టకూడదని ఇటీవల కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా కొందరు ముస్లీం అమ్మాయిలు కోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

ముస్లీం అమ్మాయిలను అడ్డుకున్న ప్రిన్సిపాల్
కాలేజ్ లు ప్రారంభం అయిన ఈ రోజు (బుధవారం) ఉత్తర కర్ణాటకలోని విజయపురంలోని ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ లు వేసుకుని కొందరు ముస్లీం అమ్మాయిలు బలవంతంగా కాలేజ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే కాలేజ్ ప్రిన్సిపాల్ తో పాటు అక్కడ ఉన్న మహిళా పోలీసులు హిజాబ్ లు వేసుకుని కాలేజ్ లోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన అమ్మాయిలను అడ్డుకున్నారు.

హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని మనవి
కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని, హిజాబ్ లు వేసుకుని లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని హిజాబ్ లు వేసుకుని కాలేజ్ దగ్గరకు వెళ్లిన అమ్మాయిలకు ఆ ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపాల్ తేల్చి చెప్పారు. ప్రతిఒక్కరూ కోర్టు ఆదేశాలను పాటించాలని, కాలేజ్ దగ్గర శాంతిని కాపాడాలని కాలేజ్ ప్రిన్సిపాల్, స్థానిక పోలీసులు ముస్లీం అమ్మయిలకు మనవి చేశారు.

టెన్షన్... టెన్షన్
కాలేజ్ లోని ఒక గదిలో బుర్కాలు, హిజాబ్ లు భద్రపరచడానికి ఏర్పాట్లు చేశామని, అక్కడ మతపరమైన దుస్తులు తీసివేసి క్లాసులకు హాజరుకావాలని కాలేజ్ ప్రిన్సిపాల్ ముస్లీం అమ్మాయిలకు మనవి చేశారు. ఇదే సమయంలో కాలేజ్ ప్రిన్సిపాల్ తో కొందరు అమ్మాయిలు వాదనలకు దిగి ధర్నాలు చెయ్యడంతో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తతంగం వీడియోలు తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ రోజు (బుధవారం) మద్యాహ్నం కర్ణాటక హైకోర్టులో హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణ జరగనుంది.
-
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications