హిమాచల్ ప్రదేశ్‌లో ముక్కోణపు పోటీ..బీజేపీని కాంగ్రెస్ ఆప్ అడ్డుకోగలవా..?

హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.నవంబర్ 12 శనివారం ఈ రాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లో గురువారమే ప్రచారం ముగిసింది.ఇక బీజేపీ నుంచి ప్రధాని మోదీ ప్రచార బాధ్యతలు నిర్వహించారు. అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో బిజీగా ఉండటంతో ఆయన స్థానాన్ని ప్రియాంకా భర్తీ చేశారు. ఇక ఆప్ తరపున ఢిల్లీ,పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్,భగవంత్ మన్‌లు ప్రచార బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటి వరకు ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉండగా.. తాజాగా ఆప్ కూడా బరిలో నిలిచింది.దీంతో ముక్కోణపు పోటీ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలు, కాంగ్రెస్ 21 స్థానాలు, ఇండిపెండెంట్లు రెండు స్థానాలు, సీపీఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి. మొత్తం 68 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌కు సంబంధించి మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Himachal Pradesh Assembly elections 2022 live updates in telugu:Its a triangular fight in the hill state

Nov 12, 2022, 6:16 pm IST

హిమాచల్ ప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్. ఈవీఎంలను సీల్ చేసి జాగ్రత్తగా తరలించేందుకు సిద్ధం చేసిన అధికారులు
Nov 12, 2022, 4:35 pm IST
హిమాచల్ ప్రదేశ్

కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నిప్పులు చెరిగారు. తప్పుడు హామీలను ఇచ్చిందంటూ మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా నెరవేర్చలేని వాగ్దానాలు చేసిందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ధ్వజమెత్తారు.
Nov 12, 2022, 4:14 pm IST
హిమాచల్ ప్రదేశ్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటైన పోలింగ్ కేంద్రం- తశిగంగ్. ఇక్కడ 98.08 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 52 ఓటర్లు ఉండగా.. 51 ఓట్లు పోల్ అయ్యాయి.
Nov 12, 2022, 4:05 pm IST
హిమాచల్ ప్రదేశ్

మధ్యాహ్నం 3 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు.
Nov 12, 2022, 3:09 pm IST
హిమాచల్ ప్రదేశ్

పూర్తి అవగాహనతో ఓటు వేయండి. రాష్ట్ర స్థితిగతులను సమూలంగా మార్చివేయడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. హిమాచల్ ప్రదేశ్ ఉజ్వల భవిష్యత్ కోసం మీ సహకారం అవసరం - ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా
Nov 12, 2022, 2:49 pm IST
హిమాచల్ ప్రదేశ్

తాశిగంగ్‌లో కొనసాగుతున్న పోలింగ్. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం మీద అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం కావడం దీని ప్రత్యేకత.
Nov 12, 2022, 1:52 pm IST
హిమాచల్ ప్రదేశ్

మందకొడిగా సాగుతోన్న పోలింగ్. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 37.19 శాతం వరకు మాత్రమే పోలింగ్ నమోదైనట్లు అధికారికంగా వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు.
Nov 12, 2022, 1:46 pm IST
హిమాచల్ ప్రదేశ్

ఇంకా ఊపందుకోని పోలింగ్. చాలాచోట్ల మందకొడిగానే పోలింగ్ సాగుతోంది.
Nov 12, 2022, 1:30 pm IST
హిమాచల్ ప్రదేశ్

ఈ ఎన్నికలతో బీజేపీకి పతనం తప్పదు. మెజారిటీ సీట్లను తాము గెలుచుకోబోతోన్నాం. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తోన్నారు. ఓటింగ్ సరళి తమకు అనుకూలంగా ఉంది. మంచి మెజారిటీతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం- కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్.
Nov 12, 2022, 1:19 pm IST
హిమాచల్ ప్రదేశ్

చంబా జిల్లా పంగీ తెహశీల్ పరిధిలోని ఛసక్ భటోరీ పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న 82 సంవత్సరాల వయోధిక వృద్ధురాలు.
Nov 12, 2022, 1:13 pm IST
హిమాచల్ ప్రదేశ్

ఎముకలు కొరికే చలిలోనూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్తోన్న ఓటర్లు. చంబా జిల్లా పంగీ తెహశీల్ పరిధిలోని ఛసక్ భటోరీ వద్ద కనిపించిన దృశ్యం ఇది.
Nov 12, 2022, 1:05 pm IST
హిమాచల్ ప్రదేశ్

ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొనకపోవడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఇక్కడ ఎలాగూ గెలవలేమని కాంగ్రెస్ నేతలకు అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. ఇక్కడే కాదు గుజరాత్‌లో కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.
Nov 12, 2022, 12:59 pm IST
హిమాచల్ ప్రదేశ్

ఈ ఎన్నికల్లో 40 నుంచి 45 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేసిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ప్రతిభా సింగ్.
Nov 12, 2022, 12:54 pm IST

ఆరోగ్యం, వాతావరణం సహకరించకపోయినా తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్న వయోధిక వృద్ధులను చూసి యువ ఓటర్లు స్ఫూర్తి పొందాలి - కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.
Nov 12, 2022, 12:46 pm IST
హిమాచల్ ప్రదేశ్

80 సంవత్సరాలకు పైగా వయస్సు ఉన్న లక్షా 20 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. వారికి సెల్యూట్ చేస్తున్నా- కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.
Nov 12, 2022, 12:32 pm IST
హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా 157 మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో పనిచేసే సిబ్బంది మొత్తం మహిళలే. హమీర్‌పూర్ జిల్లా విమెన్ పోలింగ్ బూత్‌తో క్రెచ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
Nov 12, 2022, 12:12 pm IST
హిమాచల్ ప్రదేశ్

తన ఓటు హక్కును వినియోగించుకున్న నారో దేవి. ఆమె వయస్సు 105 సంవత్సరాలు. చురా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ స్టేషన్ 122లో ఆమె కొద్దిసేపటి కిందటే ఓటు వేశారు.
Nov 12, 2022, 12:06 pm IST
హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ఒపీనియన్ పోల్ గానీ, ఎగ్జిట్ పోల్స్ గానీ వెల్లడించకూడదని ఆదేశించిన కేంద్రం ఎన్నికల కమిషన్. వాటిపై నిషేధం విధించినట్లు తెలిపింది.
Nov 12, 2022, 11:48 am IST
హిమాచల్ ప్రదేశ్

బిలాస్‌పూర్‌లోని విజయ్‌పూర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న భారతీయ జనత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తన భార్య మల్లిక నడ్డాతో కలిసి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Nov 12, 2022, 11:45 am IST
హిమాచల్ ప్రదేశ్

మందకొడిగా సాగుతున్న పోలింగ్. ఉదయం 11 గంటల వరకు 17.98 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లు అధికారికంగా వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్.
Nov 12, 2022, 11:03 am IST
హిమాచల్ ప్రదేశ్

అయిదేళ్ల బీజేపీ పాలనలో యువత, ఉద్యోగులు, పేద, మధ్య తరగతి కుటుంబీకులు విసిగి పోయారు. ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగింది. భారీ మెజారిటీతో తాము అధికారంలోకి వస్తాం- కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ.
Nov 12, 2022, 10:46 am IST
హిమాచల్ ప్రదేశ్

షిమ్లాలోని లాంగ్‌వుడ్ సైనిక్ రెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆనంద్ శర్మ.
Nov 12, 2022, 10:35 am IST
హిమాచల్ ప్రదేశ్

మందకొడిగా సాగుతున్న పోలింగ్. తొలి గంటలో నాలుగు శాతం మాత్రమే ఓటింగ్ నమోదు.
Nov 12, 2022, 10:25 am IST
హిమాచల్ ప్రదేశ్

హమీర్‌పూర్ జిల్లాలోని సమీర్‌పూర్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఆయన కుటుంబ సభ్యులు.
Nov 12, 2022, 9:58 am IST
హిమాచల్ ప్రదేశ్

షిమ్లాలోని రామ్‌పూర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్.
Nov 12, 2022, 9:29 am IST
హిమాచల్ ప్రదేశ్

షిమ్లాలోని పోలింగ్ స్టేషన్ 63/87లో ఓటు వేసిన మంత్రి సురేష్ భరద్వాజ్.
Nov 12, 2022, 9:12 am IST
హిమాచల్ ప్రదేశ్

మండీ జిల్లాలోని సెరాజ్‌లో గల 44వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, ఆయన భార్య సాధన, కుమార్తెలు చంద్రిక, ప్రియాంక. ఈ ఎన్నికల్లో తాను భారీ విజయంతో గెలుస్తానని జైరామ్ ఠాకూర్ చెప్పారు.
Nov 12, 2022, 9:10 am IST
హిమాచల్ ప్రదేశ్

రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ఇప్పుడున్న పరిస్థితిని మార్చడానికి ఇదే సరైన సమయం. ఈ పోలింగ్ కాంగ్రెస్‌కు కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల గొంతులను అణచివేసింది- కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్.
Nov 12, 2022, 8:56 am IST
హిమాచల్ ప్రదేశ్

హమీర్‌పూర్ జిల్లాలోని నదౌన్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్న ఓటర్లు.
Nov 12, 2022, 8:50 am IST
హిమాచల్ ప్రదేశ్

ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లే ముందు మండీలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్. భార్య సాధన, కుమార్తెలు చంద్రిక, ప్రియాంక ఇందులో పాల్గొన్నారు.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+