నన్ను యాంటీ మోడీ అనేస్తారా?, ఆ ధైర్యం ఉందా?: ప్రకాశ్ రాజ్
హైదరాబాద్: తనపై విమర్శలు చేస్తున్న వారిపై ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడైనా, ఎక్కడైనా నిజమే మాట్లాడతానని స్పష్టం చేశారు. జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ ప్రకాశ్రాజ్ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపిన విషయం తెలిసిందే.
ప్రచార పిచ్చి పట్టిందా?, ఒక్కరాత్రిలోనే..: ప్రకాష్ రాజ్కు బీజేపీ హెచ్చరిక
ప్రకాశ్ రాజ్పై బీజేపీ ఫైర్
ఓ ప్రధానిని ఉద్దేశించి అలా అనడం సబబు కాదంటూ లక్నోకు చెందిన ఓ న్యాయవాది ఆయనపై కేసు దాఖలు చేశారు. బీజేపీ నేతలు ప్రకాశ్ రాజ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రచార పిచ్చిపట్టిందంటూ మండిపడ్డారు.
యాంటీ మోడీ అంటారా?
తాజాగా ఈ విషయమై ప్రకాశ్ రాజ్ ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా నేను నిజమే మాట్లాడతా. మోడీ విషయంలోనూ నేను నిజమే మాట్లాడాను. అంతమాత్రానికే నన్ను యాంటీ మోడీ అనేస్తారా? ఆయన మన ప్రధాని. ఆయనపై నాకు గౌరవం ఉంది. కానీ కొన్ని విషయాల్లో మోడీతో ఏకీభవించలేను' అని అన్నారు.
ధైర్యం ఉందా?
‘నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్న వారికి నా ఎదురుగా వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేదు. ఇంత జరిగినా ఇప్పటికీ నా మాటలపైనే నిలబడతా.' అని చెప్పుకొచ్చారు ప్రకాశ్.
ప్రకాశ్ ఆగ్రహం
కాగా, గౌరీ లంకేశ్ కుటుంబంతో ప్రకాశ్ రాజ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె హత్యకు గురై రోజులు గడుస్తున్నా ఇంకా నిందితులను పట్టుకోకపోవడంపై ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోపై ఆమె హత్యపై ప్రధాని స్పందించాలని కోరుతూ.. మోడీ తనకంటే పెద్ద నటుడని వ్యాఖ్యానించారు.