లంక ద్వారా టెర్రరిస్ట్స్: దక్షిణాది విమానాశ్రయాలకు ఐబి
హైదరాబాద్: దక్షిణ భారత దేశంలోని ప్రతిష్ఠాత్మక విమానాశ్రయాలకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, తమిళనాడు రాజధాని చెన్నై, కర్నాటక రాజధాని బెంగళూరు విమానాశ్రయాలలో ఐబీ అప్రమత్తం చేసింది.
ఉగ్రవాదులు శ్రీలంక ద్వారా భారత దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐబి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
సిఐఎస్ఎప్ శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు ముమ్మరం చేసింది. శ్రీలంక ద్వారా ఉగ్రవాదులు దేశంలో చొరబడి, దక్షిణ భారత దేశంలోని విమానాశ్రయాలపై దాడులకు తెగబడే అవకాశం ఉందంటూ ఐబి హెచ్చరించడంతో విమానాశ్రయాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
English summary
IB sounds terror alert for South India capital Cities.
Story first published: Thursday, June 19, 2014, 15:16 [IST]